కలెక్టర్‌ రాక కోసం పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ రాక కోసం పడిగాపులు

Published Tue, Mar 25 2025 2:09 AM | Last Updated on Tue, Mar 25 2025 2:04 AM

హన్మకొండ అర్బన్‌: ఓవైపు అర్జీదారులు వినతులిస్తారని అధికారులు.. మరోవైపు కలెక్టర్‌ వస్తే వినతులిద్దామని అర్జీదారులు పడిగాపులు కాశారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు, అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి వినతులు స్వీకరించేందుకు వేచి చూశారు. కానీ అర్జీలిచ్చేవారు లేకపోవడంతో అధికారులు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. మరో వైపు అదే హాల్‌లో వెనుకవైపు కూర్చున్న వారంతా కలెక్టర్‌ ప్రావీణ్య వస్తే వినతులు ఇద్దామని వేచి చూశారు. కానీ.. అత్యవసర పనుల కారణంగా, లెప్రసీ డే కార్యక్రమాల వల్ల ఈవారం కలెక్టర్‌ ప్రజావాణికి రాలేదు. చివరికి అధికారులు వెళ్లే సమయంలో అంతా వచ్చి తమ వినతులు ఇచ్చి రసీదు తీసుకుని వెళ్లారు.

కలెక్టర్‌ రాక కోసం పడిగాపులు1
1/1

కలెక్టర్‌ రాక కోసం పడిగాపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement