గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Jun 13 2026 7:26 AM | Updated on Jun 13 2026 7:26 AM

శనివారం శ్రీ 13 శ్రీ జూన్‌ శ్రీ 2026 ● కూటమి ప్రభుత్వంపై వెల్లువెత్తిన ప్రజావ్యతిరేకత ● వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ● నియోజకవర్గాల సమన్వయకర్తలు, శ్రేణులు హాజరు సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రయత్నించకపోవడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదం తొక్కాయి. ఆయా నియోజకవర్గాల్లో శుక్రవారం నిరసన ర్యాలీలు జరిగాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొరిటెపాడు సెంటర్‌ నుంచి లాడ్జి సెంటర్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం నేతృత్వం వహించారు. అంబటి రాంబాబు ట్రాక్టర్‌ నడుపుతూ ప్రదర్శనలో పాల్గొన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనపై రూపొందించిన ప్లకార్డులు లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రదర్శించారు. అనంతరం డీఎస్సీ దిష్టిబొమ్మ దహణం చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆ దిష్టిబొమ్మను లాక్కున్నారు. దీంతో పోలీసులకు, అంబటి రాంబాబుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నెల 4న నిరసన సమయంలో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న ర్యాలీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన టీడీపీ నాయకులు వైఎస్‌ జగన్‌ దిష్టిబొమ్మ దహనం చేశారని, ఆ సమయంలో పోలీసులు అడ్డుకోకుండా టీడీపీ నాయకులకు బందోబస్తుగా నిలిచారంటూ అంబటి ధ్వజమెత్తారు. తాము డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా పోస్టులను రూ. లక్షలకు అమ్ముకున్న లోకేష్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీఎస్సీ దిష్టబొమ్మ దహనానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. ఇదెక్కడి రాజ్యాంగం అంటూ విమర్శించారు. గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా, జిల్లా పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో వన్‌టౌన్‌లో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. పొన్నూరు రోడ్డు వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలీసులు అడ్డుకుని దిష్టిబొమ్మను లాక్కుని చెల్లాచెదురు చేశారు. పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ప్రత్తిపాడులో... ప్రత్తిపాడులో నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్‌కుమార్‌, నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్‌ నల్లకండువాలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు – పర్చూరు పాత మద్రాసు రోడ్డులోని వైఎస్సార్‌ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దిష్టిబొమ్మ దహనం చేశారు. యువకులు బైక్‌ ర్యాలీ, రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. దిష్టిబొమ్మ దహనం చేసిన సమయంలో పోలీసులు అడ్డుకునే క్రమంలో మంటలతో ఉన్న దిష్టిబొమ్మను ఎస్సై నరహరి కార్యకర్తల మధ్యకు లాక్కురావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులకు, వైఎస్సార్‌సీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. వైఎస్సార్‌సీపీ నేతల ఫ్లెక్సీలు తొలగించే ప్రయత్నం చేయడంతో పార్టీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ బలసాని కిరణ్‌కుమార్‌ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పొన్నూరులో... పొన్నూరులో నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ నేతృత్వంలో పొన్నూరు పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. పట్టణంలోని ఐలాండ్‌ సెంటర్‌ వరకు కొనసాగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.

న్యూస్‌రీల్‌

బూటకపు హామీలతో గద్దెనెక్కిన బాబు

అంబటి రాంబాబు మాట్లాడుతూ అమలు సాధ్యం కాని బూటకపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఓట్లేసిన ప్రజలను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. సూపర్‌సిక్స్‌ హామీల్లో ప్రధానమైన ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రూ.1,500 చొప్పున ఇస్తామని మోసగించారని ఆరోపించారు. 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు నెలవారీ పెన్షన్‌ ఇస్తామని మోసం చేశారన్నారు. ఆయన సుపుత్రుడు నారా లోకేష్‌ యువగళం పేరుతో ప్రతి నిరుద్యోగికి రూ.మూడువేలు భృతి ఇస్తామని మోసగించారని, ఆయనకు ఎమ్మెల్యేగా ఉద్యోగం వచ్చి, మంత్రిగా ప్రమోషన్‌ వచ్చిందని ఆరోపించారు. ప్రస్తుతం సీఎంగా డబుల్‌ ప్రమోషన్‌ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వమిదని పేర్కొన్నారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రపంచ మోసగాడు చంద్రబాబు, సీఎం కావాలనుకునే లోకేష్‌ ఆలిండియా మోసగాడని, వైఎస్సార్‌ సీపీ పాలనలో 30 వేల మంది మహిళలు ఉమెన్‌ ట్రాఫికింగ్‌ కింద రాష్ట్రం నుంచి తరలించబడ్డారని అబద్ధాలు చెప్పిన ఆంధ్రా మోసగాడు పవన్‌ కళ్యాణ్‌ అని అన్నారు. సూపర్‌ సిక్స్‌ ఇచ్చేశామని చెబుతూ, ఇవ్వలేదని ఎవరైనా అంటే వారికి నాలుక మందమని చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతారని అన్నారు. డీఎస్సీలో ఉద్యోగాల కోసం రూ.20 లక్షలు, రూ.30 లక్షలు డబ్బులు తీసుకున్న లోకేష్‌ జేబులు నింపుకొన్నారని ఆరోపించారు. తన శాఖలో జరిగిన అవినీతిపై మాట్లాడకుండా, తన బదులు అధికారులతో మాట్లాడిస్తున్నారని దుయ్యబట్టారు. రెండేళ్లకే కూటమి పనైపోయిందని చెప్పారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటులో ప్రమాదం జరిగితే సీఎం, పరిశ్రమల శాఖ మంత్రి వెళ్లకుండా శాఖతో సంబంధం లేని లోకేష్‌ వెళతారని ఎద్దేవా చేశారు. తన ఇంటిపై విధ్వంసానికి పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ గతంలో నిరాహార దీక్ష చేశానని చెప్పారు. జూలై 29న తన ఇంటి నుంచి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వరకు రెండు రోజులు వినతి పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. డీజీపీని కలిసి, దోషులను అరెస్టు చేయాలని వినతి పత్రం అందజేస్తానని చెప్పారు.

ప్రతిచోటా పోలీసుల అత్యుత్సాహం

సాగర్‌ నీటిమట్టం

పులిచింతల సమాచారం

నిమ్మకాయల ధరలు

శనివారం శ్రీ 13 శ్రీ జూన్‌ శ్రీ 2026

7

ర్యాలీలో పార్టీ గుంటూరు అధ్యక్షురాలు నూరి ఫాతిమా, పోతిన మహేష్‌, శ్యామల

ప్రత్తిపాడులో జరిగిన నిరసన ర్యాలీలో బలసాని, పార్టీ శ్రేణులు

పొన్నూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో అంబటి మురళీకృష్ణ, నాయకులు

రెండేళ్ల మోసాలపై

చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ నిరసన గళం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న తీరుపై ప్రజాగ్రహ జ్వాల రేగింది. పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న జిల్లా అధ్యక్షుడు

అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం తదితరులు

విజయపురి సౌత్‌: నాగార్జున సాగర్‌ నీటిమట్టం శుక్రవారం 517.50 అడుగులకు చేరింది. కుడికాలువకు 3,031, ఎస్‌ఎల్‌బీసీకి 450 క్యూసెక్కులు వదులుతున్నారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.4000, మోడల్‌ ధర రూ.3500 వరకు పలికింది.

మరోవైపు రాజధాని జిల్లాలో నిరసనలకు ప్రజలు రాలేదని చూపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దింపింది. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, తాడికొండ, తెనాలి నియోజకవర్గాలలో ఎక్కడికక్కడ నిరసన ర్యాలీకి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారు. గతం వారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను తెలుగుదేశం నాయకులు దహనం చేస్తుంటే దగ్గరుండి కాపలా కాసిన పోలీసులే... ఈరోజు డీఎస్సీ దిష్టిబొమ్మను తగులబెట్టకుండా అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశారు. ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రత్తిపాడులో ఎస్‌ఐ నరహరి ఓవరాక్షన్‌ చేసి తగలబడుతున్న దిష్టిబొమ్మను కార్యకర్తల మీదకు వేయడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement