ఏఎన్‌యూ యూజీ కోర్సుల సీటీఏగా అశోక్‌ కుమార్‌ నియామకం | - | Sakshi
Sakshi News home page

ఏఎన్‌యూ యూజీ కోర్సుల సీటీఏగా అశోక్‌ కుమార్‌ నియామకం

Mar 31 2026 8:50 AM | Updated on Mar 31 2026 8:50 AM

ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ కోర్సులకు సంబంధించి చీఫ్‌ టీచర్‌ అసోసియేట్‌ (సీటీఏ) గా అంబేడ్కర్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆచార్య వై.అశోక్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అశోక్‌ కుమార్‌ ప్రస్తుతం యు జి సి కోఆర్డినేటర్‌ గా, యూనివర్సిటీ న్యూస్‌ లెటర్‌ కో–ఆర్డినేటర్‌గా, యూనివర్సిటీ జర్నల్స్‌ కో–ఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన నిజాయతీగా, కష్టపడి పనిచేయగల సమర్థత ఉన్న ప్రొఫెసర్‌గా పేరొందారు. అంకితభావం, పనిపట్ల నిబద్ధత చూపుతూ ఆయనకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహిస్తుండటంతో ఆయనకు సీటీఏగా అదనపు బాధ్యతలు రావడం పట్ల అశోక్‌ కుమార్‌ అనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విసీ ఆచార్య కె.గంగాధర్‌ రావు, రెక్టర్‌ ఆచార్య ఆర్‌.శివరాం ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ జి.సింహాచలంతో పాటు పలువురు ప్రొఫెసర్లు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా యూజీ పరీక్షల కో–ఆర్డినేటర్‌ ఆచార్య ఎన్‌వీ కృష్ణారావు, అశోక్‌ కుమార్‌కు నియామక పత్రం అందజేశారు. కారు ఢీకొని దుర్గగుడి అర్చకుడి దుర్మరణం బహిరంగ వేలం ద్వారా రూ.92.90 లక్షల ఆదాయం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం దుర్గగుడి అర్చకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరానికి చెందిన పాణిగ్రాహి జగన్మోహన శర్మ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గత గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన జగన్మోహనశర్మను తాడేపల్లి పీహెచ్‌సీ సెంటర్‌కు వచ్చే సరికి కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో జగన్మోహనశర్మ రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. ప్రమాదస్థలం నుంచి హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. మరి కొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన జగన్మోహన శర్మ మరణం కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ప్రమాదంపై జగన్మోహన శర్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ప్రమాదానికి కారణమైన కారు యజమానిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన శర్మ భౌతికకాయాన్ని దుర్గగుడి దేవస్థానానికి చెందిన పలువురు అధికారులు, అర్చకులు, సిబ్బంది సందర్శంచి నివాళులర్పించారు.

పెనుగంచిప్రోలు: గ్రామంలో ఉన్న శ్రీతిరుపతమ్మ వారి ఆలయం వద్ద ఏడాది పాటు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సోమవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన బహిరంగ వేలం, ఇ–ప్రొక్యూర్మెంట్‌ టెండర్‌ ద్వారా ఆలయానికి రూ.92.90 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆలయం వద్ద కొబ్బరికాయలు విక్రయించుకునే లైసెన్స్‌ హక్కునకు రూ.50,05,000(పచ్చల శివప్రసాద్‌), మట్టికుండలు నిర్వహణ లైసెన్స్‌ హక్కునకు రూ.10,50,000(పచ్చల శివప్రసాద్‌), మునేరు అవతల 7 షెడ్లు, 4 ఏసీ గదులు, ఒక కల్యాణ మండపం నిర్వహణకు రూ.9,50,000(కొత్తపల్లి సతీష్‌కుమార్‌), ఆలయం వద్ద సంచారంగా ఐస్‌క్రీమ్‌ విక్రయించుకునే లైసెన్స్‌ హక్కునకు రూ.5,10,000(ముండ్లపాటి నాగరాజు), భక్తుల సామాన్లు, పాదరక్షలు భద్రపరచు లైసెన్ప్‌ హక్కునకు రూ.3,15,000 (గడిపూడి గోపి), సులభ కాంప్లెక్స్‌ నిర్వహణకు రూ.11,80,000(నూతలపాటి సురేష్‌), పువ్వులు, పాలు, బియ్యం పోగుచేసుకునే హక్కునకు రూ.2,80,000(దండా పుష్పలత), హెచ్చు పాటదారులుగా నిలిచి లైసెన్స్‌ హక్కును పొందారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement