గుండవరం, గొడవర్రు గ్రామ ప్రభల వద్ద అంబటి ప్రత్యేక పూజలు
చేబ్రోలు: మహాశివరాత్రి సందర్భంగా క్వారీ బాలకోటేశ్వరస్వామికి తరలివెళ్లే బారీ విద్యుత్ ప్రభల వద్ద శనివారం రాత్రి వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. చేబ్రోలు మండలం గుండవరం గ్రామ ప్రభ, గొడవర్రు గ్రామ ప్రభల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు, భక్తులు, అభిమానులు అంబటిని ఘనంగా సన్మానించారు. ఆయన వెంట చుక్కా నాగబాబు, రెండు గ్రామాలకు చెందిన పెద్దలు, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.


