న్యూస్రీల్
శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5844 టీఎంసీలు.
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.9000, గరిష్ట ధర రూ.12500, మోడల్ ధర రూ.10500 వరకు పలికింది.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 532.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయింది.
భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే నిర్వహించారు. క్రీస్తుకు శిలువ వేసే వృత్తాంతాన్ని తెలియచేస్తూ కళాకారులు ప్రదర్శనలిచ్చారు. క్రైస్తవులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని మత గురువులు బోధించారు. ప్రేమ, కరుణతో జీవించాలని సూచించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు
7


