ఏపీపీపీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

ఏపీపీపీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

Oct 6 2025 2:38 AM | Updated on Oct 6 2025 2:38 AM

ఏపీపీ

ఏపీపీపీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

ఏపీపీపీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ వైభవంగా శ్రీకృష్ణ మందిర వార్షికోత్సవం హోరాహోరీగా ఎడ్ల పోటీలు శివాజీ పల్లకీ సేవకు స్వాగతం ఆలయ నిర్మాణానికి విరాళం

గుంటూరు రూరల్‌: పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పరీక్ష కేంద్రంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదివారం పరిశీలించారు. నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పలకలూరు రోడ్డులోగల విజ్ఞాన్‌ నిరులా ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పరీక్షలను జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్‌), నోడల్‌ అధికారి రమణమూర్తితో కలిసి ఎస్పీ పర్యవేక్షించారు. కార్యక్రమంలో సౌత్‌ డీఎస్పీ భానోదయ, నల్లపాడు సీఐ వంశీధర్‌, ఎస్‌ఐ వాసు పాల్గొన్నారు.

తెనాలి అర్బన్‌: ఐతానగర్‌లోని శ్రీకృష్ణ మందిర వార్షికోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం విశేష పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నసంతర్పణ చేశారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపును జరిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, శ్రీకృష్ణ భక్త బృందం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బయ్యవరం(క్రోసూరు): మండలంలోని బయ్యవరం గ్రామంలో శనివారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆదివారం ఆరు పళ్ల విభాగంలో ఎనిమిది జతలు, నాలుగు పళ్ల విభాగంలో ఎనిమిది జతలు పోటీలో నిలిచాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చుట్టపక్కల గ్రామాల రైతులు ఎడ్ల పోటీలు తిలకించేందుకు హాజరయ్యారు.

మాదల(ముప్పాళ్ళ): ఆంధ్రప్రదేశ్‌ మరాఠా రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పల్లకీ సేవ వాహనయాత్రకు మండలంలోని మాదల గ్రామం వద్ద సంఘ సభ్యులు ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు. మరాఠా సంఘం అధ్యక్షులు వెంకట సోమౌజీ ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర విజయవాడ శ్రీకనకదుర్గమ్మ ఆలయం నుంచి శ్రీశైలం శ్రీమల్లికార్జునస్వామి ఆలయం వరకు సాగనుంది. యాత్ర వాహనాలకు మాదల వద్ద సంఘ సభ్యులు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముప్పాళ్ల మీదుగా నరసరావుపేటకు యాత్ర వెళ్లింది. సంఘ సభ్యులు పులహరి పిరోజీ పాల్గొన్నారు.

నరసరావుపేట ఈస్ట్‌: సత్తెనపల్లిరోడ్డు పులుపులవారి వీధిలోని శ్రీవీరాంజనేయస్వామి సహిత శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి రాతి ఆలయ నిర్మాణానికి ఆదివారం పలువురు దాతలు విరాళాలను కమిటీ సభ్యులకు అందించారు. పట్టణానికి చెందిన మెడికల్‌ వ్యాపారి అర్వపల్లి రామకోటి సుబ్బారావు, నాగేశ్వరి దంపతులు ముఖమండపం 12వ రాతి స్తంభం నిర్మాణానికి రూ.3,01,116 అందించారు. వర్రా సావిత్రమ్మ రూ.51,116, అర్వపల్లి సాంబశివరావు, వెంకట విజయలక్ష్మి దంపతులు రూ.25,116 ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పులుపుల రాము, వనమా సాంబశివరావు, కోవూరు శివ శ్రీనుబాబు, వనమా కృష్ణ పాల్గొన్నారు.

ఏపీపీపీ పరీక్ష కేంద్రాన్ని  పరిశీలించిన జిల్లా ఎస్పీ 
1
1/3

ఏపీపీపీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

ఏపీపీపీ పరీక్ష కేంద్రాన్ని  పరిశీలించిన జిల్లా ఎస్పీ 
2
2/3

ఏపీపీపీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

ఏపీపీపీ పరీక్ష కేంద్రాన్ని  పరిశీలించిన జిల్లా ఎస్పీ 
3
3/3

ఏపీపీపీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement