
వైఎస్సార్ సీపీలో పలువురికి పదవులు
పట్నంబజారు: ౖవెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పలువురిని పదవుల్లో నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాడికొండ నియోజకవర్గానికి చెందిన ఆవుల రమణారెడ్డిని పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, బి.వెంకటస్వామిని బీసీ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, వంగా సీతారామిరెడ్డిని రాష్ట్ర వలంటీర్ల విభాగం జోనల్ అధ్యక్షుడిగా, సకిల కమలారెడ్డిని రాష్ట్ర పబ్లిసిటీ విభాగం కార్యదర్శిగా, కొరివి రవికిశోర్ను రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ సహాయ కార్యదర్శిగా, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మున్నంగి వివేకానందరెడ్డిని రాష్ట్ర మున్సిపల్ విభాగం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.