మంత్రి ప్రకటనలో స్పష్టత కరువు | - | Sakshi
Sakshi News home page

మంత్రి ప్రకటనలో స్పష్టత కరువు

Jul 14 2025 4:53 AM | Updated on Jul 14 2025 4:53 AM

మంత్రి ప్రకటనలో స్పష్టత కరువు

మంత్రి ప్రకటనలో స్పష్టత కరువు

లక్ష్మీపురం: నెల రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ స్పందించకుండా, ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ మంత్రి శనివారం ప్రకటన చేశారని, జీతాలు ఎప్పటి నుంచి పెంచుతామన్నారని కానీ, ఎంత పెంచుతారని కానీ స్పష్టత లేనందునే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు సమ్మెలోకి దిగారని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ – ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరు తక్కెళ్లపాడు హెడ్‌వాటర్‌ వద్ద ఆదివారం కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభంతో నగరపాలక సంస్థకు చెందిన ఉండవల్లి, మంగళగిరి, సంగం జాగర్లమూడి, తక్కెళ్లపాడు హెడ్‌ వాటర్‌ కార్మికులు సమ్మెలోకి దిగడంతో గుంటూరు నగరానికి నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. మున్సిపల్‌ అధికారులు సమ్మె చేస్తున్న కార్మికులపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా పారిశుద్ధ్య కార్మికులను కూడా సమ్మెలోకి దింపుతామని హెచ్చరించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ కార్మికులకు జీవో నంబర్‌ 36 ప్రకారం వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాల అమలు, ఇంజనీరింగ్‌ కార్మికుల కేటగిరీల నిర్ధారణలో జరిగిన తప్పులు సరి చేయడం, గత 17 రోజుల సమ్మె ఒప్పందాలకు జీవోలు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నగర అధ్యక్షులు పూనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు పాశం పూర్ణచంద్రరావు, ఇంజినీరింగ్‌ విభాగం నాయకులు యాసిర్‌ ఖాన్‌, బాలకృష్ణ, రవి, జానీ, నాగరాజు, మహేష్‌, సురేష్‌, లీక్‌ వర్కర్లు పాల్గొన్నారు.

అందుకే సమ్మెలోకి వెళ్లాం

కక్ష సాధింపు చర్యలకు దిగితే పారిశుధ్ధ్య కార్మికులు కూడా సమ్మెలోకి..

సమ్మెలో తక్కెళ్లపాడు

హెడ్‌ వాటర్‌ కార్మికులు

ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement