
గోళ్లమూడి చెరువును మోడల్గా అభివృద్ధి చేయాలి
పెదకాకాని: గోళ్లమూడి తాగునీటి చెరువును మోడల్గా అభివృద్ధి చేయాలని ఉపాధి హామీ పథకం రాష్ట్ర సంచాలకులు వైవీ షణ్ముఖకుమార్ అన్నారు. పెదకాకాని మండలం గోళ్లమూడి, ఉప్పలపాడు గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ పథకం నిర్వహణ పరిశీలన కోసం గురువారం రాష్ట్ర బృందం పర్యటించింది. ఆయన మాట్లాడుతూ గోళ్లమూడిలోని తాగు నీటి చెరువును పల్లె పుష్కరిణి కింద చేపట్టి అభివృద్ధి చేయాలని సూచించారు. తాగునీటి అవసరాలపై గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం ఉప్పలపాడులో పంట కుంట(ఫాం పాంట్స్) తవ్వుతున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. శ్రామికులకు రోజువారి వేతనం కనీసం రూ.290 ఉండేలా చూ డాలన్నారు. పంట కుంట నిర్మాణం చేపట్టిన రైతులతో మాట్లాడి సూచన చేశారు. కుంట కట్టలపై పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పెంచడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చన్నారు. చేపల పెంపకం కూడా చేపట్టవచ్చన్నారు. అనంతరం లాలుపురం గ్రామంలో పర్యటించారు.
ఉపాధి హామీ పథకం రాష్ట్ర సంచాలకులు షణ్ముఖకుమార్ గోళ్లమూడి, ఉప్పలపాడు గ్రామాలు సందర్శన