పిడుగుపాటుకు వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

May 30 2025 1:27 AM | Updated on May 30 2025 1:27 AM

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

మాచర్ల మండలం కొప్పునూరుకు చెందిన గొర్రెల కాపరిగా గుర్తింపు

బండారుపల్లి(తాడికొండ): పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన తాడికొండ మండలం బండారుపల్లి గ్రామ పంట పొలాల్లో జరిగింది. వివరాల ప్రకారం.. మాచర్ల మండలం కొప్పునూరుకు చెందిన రేఖా ఆంజనేయులు గొర్రెల మందతో సంచరిస్తూ బండారుపల్లి గ్రామ పంట పొలాల్లో మధ్యాహ్నం సమయంలో విరామం కోసం చెట్టు కిందకు వెళ్లాడు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో చెట్టుపై పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వెంట ఉన్న కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసునమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించినట్లు సీఐ కె వాసు తెలిపారు.

పిడుగుపాటుకు గేదె మృతి

తాడేపల్లిరూరల్‌: తాడేపల్లి రూరల్‌ ప్రాతూరులో పిడుగు పాటుకు గురువారం ఒక పాడి గేదె మృతి చెందింది. తాడేపల్లి పశువైద్యులు డాక్టర్‌ నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రాతూరు గ్రామానికి చెందిన మోటేపల్లి సాయిచందు అనే రైతు ఏడు గేదెలను పెంచుతున్నాడని, ప్రతి రోజు గడ్డి కోసం కృష్ణానది తీరానికి తీసుకువెళతాడని, మధ్యాహ్నం 3 గంటల సమయంలో పిడుగులతో కూడిన వర్షం పడింది. గేదెలు మేస్తున్న దగ్గరగా పిడుగు పడడంతో ఒక పాడిగేదె మృతి చెందిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement