
బిల్లుల్లోనూ పచ్చపాతం
నెహ్రూనగర్: జనవరి 10వ తేదీన గుంటూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వచ్చారు. ఆయన పర్యటించే ప్రాంతం ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి చేబ్రోలు హనుమయ్య కంపెనీ వరకు రోడ్లు అందంగా కనిపించేందుకు షో మొక్కలు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి రూ.35 లక్షలు వెచ్చించి తెప్పించారు. ఎన్ని తెప్పించారో.. ఎన్ని ఉన్నాయో నేటికీ నగరపాలక సంస్థ అధికారుల వద్ద లెక్క లేదు. అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మొక్కలు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. కొన్ని మొక్కలు ఎండిపోయాయి. దీనిపై సాక్షిలో ఏప్రిల్ 13వ తేదీన ‘ఎండిన మొక్కలు..తేలని లెక్కలు’ పేరిట కథనం ప్రచురితమైంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్గా మారింది. దీంతో ఎక్కడ ఈ బిల్లు ఆపితే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అని అప్పుడు ఏడీహెచ్గా పనిచేసిన శ్రీనివాస్ను సరెండర్ చేసి మరీ సదరు బిల్లు రూ.35 లక్షలు ప్రాసెస్ చేసినట్లు సమాచారం.
ఖర్చుల బిల్లు వస్తే ఒట్టు
2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్షన్ రోజు పోలింగ్, తర్వాత కౌంటింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, బ్యారికేడింగ్, డిపార్ట్మెంట్ సిబ్బందికి సంబంధించిన భోజనాలు, టీ, కాఫీలు, స్నాక్స్, ఇతర స్టేషనరీ వంటి పనులు కాంట్రాక్టర్లు సుమారు 1.50 కోట్ల వర్కులు ఇంజినీరింగ్ అధికారుల హాహీతో చేపట్టారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ బిల్లులను అధికారులు ప్రాసెస్ చేయకుండా పక్కన పెట్టారని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
వడ్డీలకు తీసుకొచ్చి...
కొంతమంది కాంట్రాక్టర్లు బ్యాంకుల్లో స్థలాలు, ఇళ్లు తనాఖాలు పెట్టి పనులు చేశారు. ఆ వర్కులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి వడ్డీ పడుతోంది. మరికొంత మంది కాంట్రాక్టర్లు బయట వ్యక్తుల వద్ద నుంచి వడ్డీ కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీని వలన తాము అప్పుల్లో కూరుకుపోతున్నామని బహిరంగంగానే వాపోతున్నారు. ఏదో విధంగా బిల్లు ప్రాసెస్ చేయించాలని ఇంజినీరింగ్ అధికారులను వేడుకుంటున్నారు.
సిఫార్సులు.. పర్సంటేజీలు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత సర్కారు హయాంలో చేసిన వర్కుల బిల్లులు ప్రాసెస్ చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చేసిన వర్కులకు మాత్రమే బిల్లులు ప్రాసెస్ అవుతున్నట్లు కాంట్రాక్టర్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎవరైపా వడ్డీలు కట్టుకోలేక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎంతకొంత ముట్టజెప్పి సిఫార్సు చేయించుకుంటున్నారు. ఇక్కడ నగరపాలక సంస్థ అధికారులు కూడా పర్సంటేజీ ఇస్తేనే బిల్లు ప్రాసెస్ చేస్తామని చెబుతున్నారు. చేసేదేమీ లేక అధికారులు అడిగినంత ఇచ్చుకుని ప్రాసెస్ చేయించుకుంటున్నారు కాంట్రాక్టర్లు.
బిల్లుల ప్రాసెసింగ్లో మున్సిపల్ అధికారుల తీరిది తమ అనుకునే వారికి మాత్రమే అత్యధిక ప్రాధాన్యత అవసరం లేదనుకున్న వారికై తే నెలల తరబడి పెండింగ్ ఇటీవల సీఎం పర్యటనకు రూ.35 లక్షల విలువైన మొక్కలు ఎక్కడున్నాయో.. ఏమైపోయాయో కూడా తెలియని దుస్థితి రూ.35 లక్షల బిల్లు ఆగమేఘాలపై ప్రాసెస్ పూర్తి ఇంకా పెండింగ్లోనే ఏడాది క్రితం ఎన్నికల ఖర్చు బిల్లులు
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. తమ అనుకునే కాంట్రాక్టర్ల బిల్లు ప్రాసెస్ చేయడంలో చూపుతున్న ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది. మిగతా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో మొండి చేయి చూపుతున్నారనేది జగమెరిగిన సత్యం. గత ప్రభుత్వంలో రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లలో కొంత మందికి బిల్లులు చెల్లింపులు జరపకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు పర్సంటేజ్ రూపంలో ముడుపులు సమర్పించుకుంటే ఎప్పటి బిల్లు అయినా ప్రాసెస్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
కమిషనర్ ఆదేశాల మేరకే చెల్లింపులు
ఎవరైనా కాంట్రాక్టర్ అత్యవసరం అని అడిగితే సదరు బిల్లుల చెల్లింపులు కమిషనర్ ఆదేశాల మేరకు ప్రాసెస్ చేస్తున్నాం.
– నమ్రత్కుమార్, అకౌంటెంట్