మరోసారి హాట్‌టాపిక్‌గా పని జీవిత సమతుల్యత..! వైరల్‌గా హర్ష్‌గోయెంకా ప్రసంగం | Harsh Goenka Speech In RPG Townhall, Says No Talks On Sunday Work, Staring At Wife Goes Viral | Sakshi
Sakshi News home page

ఆ విషయాలు గురించి అస్సలు మాట్లాడను! హాట్‌టాపిక్‌గా హర్ష్‌గోయెంకా ప్రసంగం

Jun 4 2025 11:16 AM | Updated on Jun 4 2025 11:52 AM

Harsh Goenkas Speech No Talks On Sunday Work, Staring At Wife Goes Viral

పని జీవిత సమతుల్యత అనే టాపిక్‌ మాత్రం ప్రతిసారి రసవత్తరమైన అంశంగా మారిపోతోంది. దీనిపై ఒక్కొక్కరిలో ఒక్కో అభిప్రాయం ఉంది. ఇది వారి వారి హోదాల రీత్యా సరైనది కావొచ్చు. అందరికీ వర్తించాలంటే మాత్రం కష్టమే. ఉద్యోగి శరీర తత్వం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతలు తదితరాల దృష్ట్యా మారుతూ ఉంటుందనేది నిపుణుల వాదన. అంగీకరించక తప్పని వాస్తవం కూడా. బహుశా ఈ విషయాన్నే సూటిగా చెప్పే ఉద్దేశ్యంతో మరోసారి వివరణ ఇచ్చినట్లుగా ఉంది నెట్టింట వైరల్‌ అవుతున్న హర్ష్‌ గోయెంకా ప్రసంగం. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్‌పీజీ గ్రూప్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయెంకా ఎప్పటికప్పుడూ నెటిజన్లతో ఆసక్తికరమైన విషయాలను షేర్‌ చేసుకుంటుంటారు. అలానే ఈసారి తన ఉద్యోగుల నుద్దేశించి ప్రసంగించిన వీడియోని షేర్‌ చేసుకుని..నెటిజన్ల మనసును దోచుకున్నారు. ఆ వీడియోలో హర్ష్‌ గోయెంకా..తాను ఆదివారాల్లో పనిచేయడం గురించి, జీవిత భాగస్వాములను చూస్తుండటం గురించి మాట్లాడటం లేదు. అందువల్ల కాసేపు శ్రద్ధతో నా మాటలు ఆలకించండి అన్నారు. 

అంతే ఆ సభా ప్రాంగణంలో నవ్వులు విరిశాయి. ఉ‍ద్యోగులంతా ఆయన ప్రసంగానికి కడుపుబ్బా నవ్వుతున్నట్లు కనిపిస్తోంది ఆ వీడియోలో. నెటిజన్లు కూడా ఆ వీడియోని చూసి మీ  సంస్థలో ప్రతి ఉద్యోగి పనిలో సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. ఐతే ఇంతకమునుపు ఇదే హాలులో ఎల్ అండ్ టి అనే కంపెనీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్  తన ఉద్యోగులనుద్దేశించి మాట్లాడిన మాటలతో ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. 

నిజానికి సుబ్రహ్మణ్యన్‌ మాటలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఉద్యోగుల పోటీతత్వం గురించి చెబుతూ ఆయన..వారానికి 90 గంటలు పనిచేయాలని అన్నారు. అయినా ఎంత సేపు భార్యను చూస్తుంటారు, ఆదివారం కూడా ఆఫీసులకు వచ్చి పనిచేయాలన్నారు. ఎందుకంటే తాను కూడా ఆదివారాల్లో పనిచేస్తానని చెప్పారు. పైగా అలా చేయడం వల్ల తాను మరింత సంతోషంగా ఉన్నానని సుబ్రహ్మణ్యన్‌ అన్నారు. 

అంతే ఒక్కసారి పనిజీవిత సమతుల్యతకు ఆస్కారం ఏముందని న్యూట్రిషన్లు, ప్రముఖులు భగ్గుమన్నారు. ఇది సరైనది కాదంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. పైగా ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారి చర్చలకు దారితీసింది. ఇక మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ..తాను పని నాణ్యతను నమ్ముతానని, ఎని గంటలు చేశామన్నది లెక్కలోకి తీసుకోనని చెప్పారు. అలాగే పనినాణ్యతపై దృష్టి పెట్టాలే గానీ, పరిమాణంపై కాదని తేల్చి చెప్పారు. ఆఖరికి బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్‌ సైతం పని గంటలు కాదు, నాణ్యతే ముఖ్యం అని చెప్పారు. 

ఇక వ్యాపరవేత్త హర్ష్‌ గోయెంకా కూడా గతంలో వారానికి 90 గంటల పనా? అని ఖండించారు. సండే అనేది సూర్యుడి డ్యూటీగా భావించి డే ఆఫ్‌గా ఎందుకు భావించకూదని అన్నారు. అయినా జీవితాన్ని శాశ్వతమైన ఆఫీస్‌ పనిగా మార్చేస్తే విజయం మాట దేవుడెరగు..అనర్థాలే తెచ్చిపెడుతుందన్నారు. 

ఆయన కూడా వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్ అనేది అస్సలు ఆప్షన్‌ కాదు, అది మన అవసరం అని నొక్కి చెప్పారు. వర్క్‌ని చాలా తెలివిగా స్మార్ట్‌గా చేసేందుకు ప్రాముఖ్యత ఇస్తానన్నారాయన. సో పనిజీవిత సముతుల్యత అన్నది ఎంత ముఖ్యమో అర్థమైంది కదా..కాబట్టి బిజీకి ఛాన్స్‌ ఇవ్వకుండా బ్యాలెన్స్‌ చేసుకుందామా మరీ..!.

 

(చదవండి: నావికాదళంలో అత్యున్నత అధికారిగా భాగ్యనగరం కుర్రాడు..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement