హైదరాబాద్ : చర్మ కణాల సహజ మరమ్మతు ప్రక్రియను ప్రోత్సహిస్తూ ఎలాంటి శస్త్ర చికిత్స అవసరం లేకుండా నిర్వహించే సెల్యూమా అడ్వాన్స్డ్ లైట్ థెరపీ సిస్టమ్ను సినీ నటి స్రవంతి చొక్కారపు ప్రారంభించారు.
బంజారాహిల్స్ రోడ్ నెం. 7లోని నిషితాస్ క్లినిక్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ చర్మవ్యాది నిపుణురాలు డాక్టర్ నిషితా రంకాతో కలిసి ఈ ఎల్ఈడీ లైట్థెరపి విధానాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నిషితా రంకా మాట్లాడుతూ సెల్యుమా ఎల్ఈడీ లైట్ థెరపీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అత్యాధునిక వైద్యం అని వెల్లడించారు. ప్రత్యేక తరంగాల ద్వారా కాంతితో కణాల్లో శక్తి ఉత్పత్తి చేస్తూ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ చికిత్స పని చేస్తుందని ఆమె తెలిపారు.


