కాంతారావుకు జాతీయ స్థాయి జ్యూరీ అవార్డు | - | Sakshi
Sakshi News home page

కాంతారావుకు జాతీయ స్థాయి జ్యూరీ అవార్డు

Apr 5 2026 8:24 AM | Updated on Apr 5 2026 8:24 AM

కాంతారావుకు జాతీయ స్థాయి జ్యూరీ అవార్డు బకాయిలు వెంటనే చెల్లించాలి జేఈఈ మెయిన్స్‌కి 1,147 మంది హాజరు సేవలపై సంతృప్త్త స్థాయి పెంచాలి నిబంధనలు మీరితే చర్యలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరుకు చెందిన చిత్రకారుడు మజ్జి సూర్య కాంతారావు జాతీ య స్థాయిలో మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. శనివారం చైన్నె లలిత కళా అకాడమీ ఆర్ట్‌ గ్యాలరీలో శ్రీ ధరిణి కళైకూడమ్‌ (కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన 21వ నేషనల్‌ కాంపిటీషన్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌లో ప్రతిష్టాత్మక జ్యూరీ అవార్డు అందుకు న్నారు. ఆయన గీసిన చిత్రాల్లోని సృజనాత్మక త, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే శైలి జ్యూరీ సభ్యులను విశేషంగా ఆకట్టుకుంది.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఏలూరు జిల్లా ఏపీ ఎన్జీఓస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్‌, కార్యదర్శి నెరుసు రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌ఎస్‌ హరనాథ్‌ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా 2022 నుంచి 2026 వరకు ఉన్న సరెండర్‌ లీవ్స్‌ బకాయిలు, మూడు డీఏలు,11 పీఆర్‌సీ అరియర్స్‌ ఇవ్వాలని కోరారు. 12 పీఆర్‌సీ కమిటీని వెంటనే నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జేఈఈ మెయిన్స్‌ రెండో విడత పరీక్షలకు శనివారం 1,147 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్‌ స్కూల్‌లో ఉదయం 123 మందికి 110 మంది, మధ్యాహ్నం 116 మందికి 111 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెం వా సవి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 184 మందికి 180 మంది, మధ్యాహ్నం 181 మందికి 174 మంది హాజరయ్యారు. శశి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 116 మందికి 112 మంది, మధ్యాహ్నం 97 మందికి 93 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 100 మందికి 92 మంది, మధ్యాహ్నం 100 మందికి 92 మంది హాజరయ్యారు. డీఎన్నార్‌ కళాశాలలో ఉదయం 97 మందికి 95 మంది, మధ్యాహ్నం 96 మందికి 88 మంది హాజరయ్యారు.

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలపై సంతృప్త స్థాయిలో వృద్ధి కనిపించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించా రు. మంత్రి మనోహర్‌ మాట్లాడుతూ జిల్లాలో రోడ్ల మరమ్మతులు, సంక్షేమ హాస్టళ్లలో వసతులపై సూచనలిచ్చారు. కాలువలు, డ్రెయిన్లలో పూడికతీత పనులు చేపట్టాలని, ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈనెల 20 వరకు గోదావరి నుంచి కాలువలకు నీరందించేలా తీర్మానించారు. మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌, కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు సొంగా రోషన్‌ కుమార్‌, చింతమనేని ప్రభాకర్‌, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు మాట్లాడారు.

పోలీస్‌స్టేషన్లకు వాహనాల అందజేత

దాతల సహకారంతో జిల్లాలోని ఏడు పోలీస్‌ స్టేషన్లకు రూ.70 లక్షల విలువైన ఏడు వాహనాలను అందించినట్టు ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. శనివారం వాహనాలు అందించిన దాతలను మంత్రులు, శాసనసభ్యులు, కలెక్టర్‌, ఏలూరు రేంజ్‌ ఐజీ, జిల్లా ఎస్పీ ఘనంగా సన్మానించారు.

సాక్షి, భీమవరం: విద్యాహక్కు చట్టం ఆర్టీఈ 12(1)(సి) అమలులో ప్రైవేట్‌ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌ పి.శ్యాంసుందర్‌ హె చ్చరించారు. ‘ఉచిత విద్య.. అంతా మిథ్య’ శీ ర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన మాట్లాడారు. జిల్లాలో తొలి విడతగా 1,047 మంది పేద విద్యార్థులు ఉచిత ప్రవేశాలకు అర్హత పొందారన్నారు. ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ప్రభుత్వం వీరికి 25 శాతం రిజర్వేషన్‌ కింద ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement