బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడిని 36 గంటల్లో అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. మంగళవారం కేసుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు. మండలంలోని నాగులగూడెం గ్రామానికి చెందిన పదేళ్ల బాలికపై మారుటి తండ్రి బోడ రవి లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. గత మూడు నెలలుగా తల్లి లేని సమయంలో బాలికపై మారు తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడుతూ, ఎవరికై నా చెబితే చంపుతానని బెదిరించాడన్నారు. ఈ విషయం తెలిసి బాలిక తల్లి, మేనమామ సోమవారం ఫిర్యాదు చేయడంతో లక్కవరం పోలీస్స్టేషన్లో కేసు నమోదుచేసి విచారణ చేశామన్నారు. సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై జబీర్, సిబ్బందితో కలిసి దర్యాప్తు చేస్తుండగా, స్థానిక రామచంద్రాపురం సాయిబాబ స్థూపం వద్ద నిందితుడు బోడ రవిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.
తాడేపల్లిగూడెం: ఇస్రో ఆధ్వర్యంలో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీల్లో ఏపీ నిట్ విద్యార్థులు సత్తా చాటారు. 36 గంటలపాటు నిర్విరామంగా జరిగిన ఈ పోటీల్లో ఏపీ నిట్ విద్యార్థుల బృందం అద్భుత ప్రతిభను కనబర్చి మూడోస్థానాన్ని కై వసం చేసుకుని రూ.50వేల నగదు బహుమతిని అందుకున్నారు. ఫైనల్ పోటీలకు అర్హత సాధించిన 55 టీమ్లలో ఏపీ నిట్కు చెందిన దక్షిణ లోకోవర్స్టీమ్ ఒకటిగా నిలిచింది. విద్యార్థులను నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణరావు, రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి అభినందించారు.
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్


