రావిపాడులో వైద్య శిబిరం
దెందులూరు: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు మృతిచెందాడు. అత్తిలి తేజ (42) సోమవారం గంగన్నగూడెం నుంచి ఏలూరు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగవరం వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తేజను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అత్తిలి తేజ (42) అక్కడికక్కడే మృతి చెందాడు.
పెంటపాడు: సాక్షి పత్రికలో శనివారం ప్రచురితమైన ‘పారిశుద్ధ్యం ఇలా.. ఆరోగ్యం ఎలా’ వార్తకు ఽఅధికారులు స్పందించారు. ముదునూరు వైద్యాధికారులు పూజిత, పవన్కుమార్ ఆధ్వర్యంలో సోమవారం సర్పంచ్ పెన్నాడ సూరిబాబు ఇంటి వద్ద పెన్నాడ, తోట వారి వీధుల్లో వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరం అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. డ్రెయినేజీ నీటితో కలుషితమైన తాగునీటిని తాగొద్దని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని గ్రామంలో ప్రచారం చేశారు. గ్రామంలో ఇంటింటి వైద్య సర్వే కోసం 4 బృందాలను పంపించారు.
రావిపాడులో వైద్య శిబిరం


