రూ.16.63 లక్షలకు లడ్డూ వేలం | - | Sakshi
Sakshi News home page

రూ.16.63 లక్షలకు లడ్డూ వేలం

Sep 7 2025 7:44 AM | Updated on Sep 7 2025 7:44 AM

రూ.16.63 లక్షలకు లడ్డూ వేలం

రూ.16.63 లక్షలకు లడ్డూ వేలం

రూ.16.63 లక్షలకు లడ్డూ వేలం 12 వేల కిలోల గోమాంసం పట్టివేత

నూజివీడు: మండలంలోని మిట్టగూడెం వినాయక చవితి నవరాత్రుల్లో విఘ్నేశ్వరుడికి ప్రసాదంగా ఏర్పాటుచేసిన 11 కేజీల లడ్డూకు శనివారం వేలం నిర్వహించగా రూ.16.63 లక్షలకు మాజీ ఎంపీటీసీ కొనకళ్ల మాధవరావు దక్కించుకున్నారు. గతేడాది సైతం లడ్డూను వేలంలో రూ.9.09 లక్షలకు మాధవరావు సొంతం చేసుకున్నారు. సర్పంచ్‌ కొనకాల నరసింహారావు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

బుట్టాయగూడెం: కలకత్తా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఒక కంటైనర్‌ను జీలుగుమిల్లి పోలీసులు శనివారం తనిఖీ చేసి అందులో సుమారు 12,100 కేజీల గోమాంసాన్ని పట్టుకున్నారు. గ్రామశివారులోని హెచ్‌పీ గ్యాస్‌ గోడౌన్‌ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కంటైనర్‌లో ఏదో తరలిస్తున్నట్లు అనుమానంతో తనిఖీ చేయగా గోమాంసాన్ని గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ మాంసాన్ని నిర్జీవ ప్రదేశంలో ఖననం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement