పొలసానిపల్లి గురుకులం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పొలసానిపల్లి గురుకులం పరిశీలన

Jul 26 2025 8:37 AM | Updated on Jul 26 2025 9:16 AM

పొలసానిపల్లి గురుకులం పరిశీలన

పొలసానిపల్లి గురుకులం పరిశీలన

భీమడోలు: మండంలోని పొలసానిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల భవనాలను తక్షణమే నిర్మించాలని, తాత్కాలిక షెడ్లను నిర్మించి బాలికలకు తరగతులను నిర్వహించాలని సీపీఎం ప్రతినిధుల బృందం డిమాండ్‌ చేసింది. పోలసానిపల్లిలో రెండు శ్లాబ్‌లు కూలడం, ఓ విద్యార్థీనీ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం సీపీఎం ప్రతినిధుల బృందం సందర్శించింది. గురుకుల కళాశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్‌.లింగరాజు మాట్లాడుతూ దళితుల విద్యపై ప్రభుత్వం అసలు శ్రద్ధ తీసుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో భీమడోలు, ద్వారకాతిరుమల మండలాల నిర్వహకులు కట్టా భాస్కరరావు, మండల నాయకులు పోలుకొండ నాగరాజు, మానుకొండ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement