
బెల్టుషాపులను ప్రోత్సహించడం సిగ్గుచేటు
భీమవరం(ప్రకాశం చౌక్): బెల్టు షాపులను ప్రభుత్వమే ప్రోత్సహించడం సిగ్గుచేటని, గీత వృత్తిని కా పాడాలంటూ పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి జుత్తిగ నరసింహామూర్తి డిమాండ్ చేశారు. సోమవారం భీమవరంలో కలెక్టరేట్ వద్ద కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘కలెక్టర్ గారికి చెప్పుకుందాం రండి’ పేరుతో ధర్నా చేపట్టారు. గీత కార్మికులు మోకులతో వినూత్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో జేసీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపిమూర్తి రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దొరుకుతుందని, ప్రభుత్వ విధానాలు, ఎకై ్సజ్ పాలసీల వలన కల్లుగీత కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. నరసింహమూర్తి మాట్లాడుతూ కల్తీ మద్యాన్ని అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని, బెల్ట్షాపులు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఎకై ్సజ్ అధికారుల సహకారంతో నడుస్తున్నాయని ఆరోపించారు. గీత కార్మి కుల కుటుంబాలకు రక్షణ కల్పించేలా గీత వృత్తిని కాపాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి బొక్కా చంటి, సంఘ జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి, నాయకులు, పెద్ద సంఖ్యలో గీత కార్మికులు పాల్గొన్నారు.
నల్ల బ్యాడ్జీలతో నిరసన
యలమంచిలి: హెచ్ఎం మూర్తిరాజు మరణం బాధాకరమని యూటీఎఫ్ జిల్లా కోశాధికారి పోలిశెట్టి క్రాంతికుమార్ అన్నారు. మూర్తిరాజు మృతికి సంతాపం తెలుపుతూ సోమవారం మండలంలోని ఏనుగువానిపాలెం హైస్కూల్ వద్ద ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పలు పాఠశాలల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ అధికారులు శిక్ష ణల పేరుతో ఉపాధ్యాయులను మానసిక వేదనకు గురిచేసి వారి ప్రాణాలతో చెలగాటం ఆ డుతున్నారని విమర్శించారు. దీనికి కారకులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి దండు పద్మావతి, మండల శాఖ అధ్యక్షుడు గుత్తిందీవి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి పంతం రామమూర్తి నాయుడు, గౌరవాధ్యక్షు డు వి.జగ్గారావు, కార్యదర్శులు బి.శైలజ, ము ద్దల బాపిరాజు, మల్లుల శ్రీధర్ పాల్గొన్నారు.