
చట్టాలపై అవగాహన అవసరం
చింతలపూడి: చింతలపూడి సబ్ జైలును ఆదివారం ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్.శ్రీదేవి సందర్శించారు. జైలులో ముద్దాయిలకు అందిస్తున్న ఆహారం, వసతి సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించారు. హింసా మా ర్గాన్ని వీడాలని, సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. వంటశాల, స్టోర్ రూమును తనిఖీ చేసి ఆహారాన్ని పరిశీలించారు. సబ్జై లు ప్రాంగణంలోని ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్త కార్యదర్శి కె.రత్నప్రసాద్, జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ మధుబాబు, సబ్ జైలు సూపరింటెండెంట్ కృపానందం, ప్యా నల్ లాయర్ టోకూరి వెంకటేష్, పీఎల్వీటీవీఎస్ రాజు, సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్కుమార్ ఉన్నారు.
జిల్లాలో అమలుకాని విద్యాహక్కు చట్టం
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యాహక్కు చట్టం ప్రైవేట్ పాఠశాలల్లో పక్కాగా అమలయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉండగా.. జిల్లాలో పూ ర్తిస్థాయిలో అమలైన దాఖలాలు లేవని పేర్కొన్నారు. కొన్ని పాఠశాలల్లో పిల్లలను చేర్పించుకుంటున్నా వివక్ష చూపుతున్నారని, తల్లిదండ్రుల నుంచి అనధికారికంగా రుసుములు వ సూలు చేస్తున్నారని తెలిపారు. ఫీజుల విషయంలో ఇబ్బందులు పెడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, జిల్లా విద్యాశాఖాధికారులు సమగ్ర విచారణ జరపాలని రవి కోరారు.
‘జన సురక్ష’పై ప్రచారం
ఏలూరు(మెట్రో): జన సురక్ష పథకాల ద్వారా సామాన్యులకు భద్రత కల్పిస్తున్నట్టు లీడ్ బ్యాంక్ మేనేజర్ డి.నీలాద్రి తెలిపారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి సహకారంతో ఏలూరు జిల్లావ్యాప్తంగా మూడు నెలల పాటు పథకాల నమోదు కార్యక్రమంపై ప్రచారం నిర్వహించనున్నామన్నారు. అటల్ పెన్షన్ యోజన ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుందన్నారు. పీఎం సురక్ష బీమా యోజనలో చేరితే రూ.2 లక్షల వరకూ ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన కింద రూ.2 లక్షల బీమా కవరేజీ ఉంటుందన్నారు. బ్యాంకు మిత్ర ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను సులభంగా పొందే అవకాశం ఉందన్నారు. ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు.