
పీజీఆర్ఎస్ వికేంద్రీకరణ
● జిల్లాతో పాటు డివిజన్, మండల, మున్సిపల్ స్థాయిల్లో నిర్వహణ
● ఆన్లైన్లోనూ ఫిర్యాదుల స్వీకరణ
● టోల్ఫ్రీ నంబర్ 1100 ఏర్పాటు
ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను వికేంద్రీకరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దీని ద్వారా వేగంగా సమస్యలు పరిష్కారమవుతాయని అంటు న్నారు. మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిలకు పీజీఆర్ఎస్ను విస్తరించారు. ఈ మేరకు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆన్లైన్లో సైతం ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు, ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా టోల్ఫ్రీ నంబర్ 1100ను ఏర్పాటు చేశారు. ఇకపై ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల, డివిజన్ స్థాయి ల్లో పీజీఆర్ఎస్ను నిర్వహించనున్నారు.
తాకిడిని తగ్గించేలా..
జిల్లాలోని దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్లో జరి గే పీజీఆర్ఎస్కు హాజరయ్యేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేక్రమంలో అర్జీల తాకిడి కూ డా ఎక్కువగా ఉండటంతో కలెక్టర్ కార్యక్రమం వి కేంద్రీకరణకు నిర్ణయించారు. స్థానికంగా పీజీఆర్ఎస్ నిర్వహించడం వల్ల ప్రజలకు వ్యయ ప్రయా సలు తగ్గడంతో పాటు సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. పీజీఆర్ఎస్ను పారదర్శకంగా, మరింత సమర్థవంతంగా నిర్వహించే వీలుంటుందని, స్థానిక సమస్యల పరిష్కారానికి అక్కడి అధికారులు ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంటుందని జిల్లా అధికారులు అంటున్నారు. స్థానికంగా అర్జీలు స్వీకరించడం వల్ల జిల్లాస్థాయిలో పని ఒత్తిడి తగ్గుతుందని, అర్జీలపై పర్యవేక్షణ పెరుగుతుందని చెబుతున్నారు.
ఆన్లైన్ ద్వారా కూడా..
పీజీఆర్ఎస్కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. హెచ్టీటీపీఎస్://మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఫిర్యాదు నమోదు, ఫిర్యాదుల స్థితి సమాచారం తెలుసుకునేందుకు ట్రోల్ ఫ్రీ 1100 నంబర్లో సంప్రదించవచ్చు.