ఉద్యోగాల పేరుతో టోకరా | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో టోకరా

May 31 2025 1:43 AM | Updated on May 31 2025 1:43 AM

ఉద్యోగాల పేరుతో టోకరా

ఉద్యోగాల పేరుతో టోకరా

భీమడోలు: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామ ని నమ్మించి మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఓ వ్యక్తిని భీమడోలు పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న షేక్‌ రసూల్‌ కలకాడను భీమడోలు కోర్టులో హాజరుపర్చారు. ఇదిలా ఉండగా ఇదే ముఠాలోని మరో వ్యక్తి అల్తాఫ్‌ పరారీలో ఉన్నాడు. భీమడోలులో సీఐ యూజే విల్సన్‌, ఎస్సై వై.సుధాకర్‌ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని తుక్కుగూడ ప్రాంతానికి చెందిన షేక్‌ రసూల్‌ కలకాడ, అతడి రెండో కుమారుడు అల్తాఫ్‌ రంగారెడ్డి జిల్లా గండిపేటలో నివాసముంటున్నారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ తమకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో సాన్ని హిత్యం ఉందని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎర వేస్తున్నారు. వారి నుంచి లక్షలాది రూపాయలు కాజేసి నకిలీ అపాయింట్‌మెంట్లతో మోసం చేస్తున్నారు. ఇలా పోలసానిపల్లికి చెందిన దివ్యాంగుడు కుక్కల నాగమల్లేశ్వరరావుకు ఏపీ సచివాలయంలోని వ్యవసాయ విభాగంలో అటెండర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. నాగమల్లేశ్వరరావు నుంచి రూ.3 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చారు. ఇది నకిలీ లెటర్‌ అని తెలిసి మోసపోయినట్టు గ్రహించిన నాగమల్లేశ్వరరావు గతేడాది మే 26న భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండికోటలో ఉన్న రసూల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు చేధించిన బృందంలోని హెచ్‌సీ ఎస్‌.శ్రీనినవాసరావు, ఎస్‌కే బాజీ, ఎం.వెంకటేశ్వరరావులు సీఐ విల్సన్‌ అభినందించారు. అలాగే పూళ్లకి చెందిన దూలం సాయిబాబా అనే వ్యక్తికి పోలీస్‌ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.20 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడేనికి చెందిన సుంకవల్లి శ్రావణ్‌కుమార్‌ అనే వ్యక్తి పొలం కొంటామని నమ్మించి, రెండు చెల్లని చెక్కులు ఇవ్వగా రసూల్‌, అల్తాఫ్‌లపై కేసు నమోదైంది.

తండ్రి అరెస్ట్‌.. పరారీలో కుమారుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement