ఏలూరులో 6 కరోనా కేసులు | - | Sakshi
Sakshi News home page

ఏలూరులో 6 కరోనా కేసులు

Jun 1 2025 12:59 AM | Updated on Jun 1 2025 12:59 AM

ఏలూరు

ఏలూరులో 6 కరోనా కేసులు

మెల్లగా విస్తరిస్తున్న మహమ్మారి

ఏలూరు టౌన్‌: ఏలూరు నగరంలో మెల్లగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా యి. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ అధికారులు మాత్రం ప్రజలను అప్రమత్తం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలెక్టరేట్‌లో శుక్రవారం నాటికి ముగ్గురు కరోనా బారిన పడగా.. తాజాగా శనివారం మరో ఇద్దరికి కరోనా సోకినట్టు చెబుతున్నారు. అలాగే ఏ లూరు అమీనాపేటలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరికి జీజీహెచ్‌లో పరీక్షలు చేశారు. నగరంలో ఆరుగురికి కరోనా సోకినట్లు వైద్య అధికారులు తెలిపారు.

రహదారులపై సర్వే

కొయ్యలగూడెం: కొయ్యలగూడెంలోని మెయిన్‌ రోడ్ల లో రెవెన్యూ అధికారులు శనివారం సర్వే చేపట్టారు. గతనెల 29న ‘సాక్షి’లో ‘పీజీఆర్‌ఎస్‌ తీరు అపహాస్యం’ శీర్షికన ప్రచురించిన కథనానికి కలెక్టర్‌ స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు సర్వేని ప్రారంభించి మార్కింగ్‌ చేశారు. దాదాపు మూడు నెలల క్రితం మల్లవరపు శ్రీనివాసు అనే వ్యక్తి కొయ్యలగూడెంలో ప్రధాన జాతీయ రహదారులు ఇరువైపులా ఆక్రమణలకు గురయ్యాయని ఫిర్యాదు చేశారు. అయితే ఆన్‌లైన్‌లో సమస్యను పరిష్కరించినట్టు సమాచారం రావడంతో ‘సాక్షి’ ద్వారా కలెక్టర్‌కి విషయం చేరింది. దీంతో కలెక్టర్‌ వెట్రిసెల్వి ప్రత్యేక శ్రద్ధతో చర్యలకు ఆదేశాలిచ్చారని అధికారులు తెలిపారు.

డిపోల ద్వారా రేషన్‌ పంపిణీ

ఏలూరు(మెట్రో): జిల్లాలోని 1,123 రేషన్‌ దుకాణాల్లో ఆదివారం నుంచి నిత్యావసర సరు కులు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు జేసీ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. జిల్లాలో 6,20,146 మంది కార్డుదారులకు రేషన్‌ పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయా నియోజకవర్గాల్లో అధికారికంగా ప్రారంభిస్తామన్నారు. ఇకపై ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు బియ్యం, పంచదార పంపిణీ చేస్తామన్నారు. 65 ఏళ్లు పైబడిన కార్డుదారులకు, దివ్యాంగులకు ప్రతినెలా 1 నుంచి 5వ తేదీ వరకు రేషన్‌ డీలర్ల ద్వారా ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు అందిస్తామని పేర్కొన్నారు.

పటిష్టంగా ‘20 సూత్రాల’ అమలు

ఏలూరు(మెట్రో): వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర–2047 విజన్‌ డాక్యుమెంట్‌ లక్ష్యసాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని 20 సూత్రాల కార్యక్రమ కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో 20 సూత్రాల కార్యక్రమాల అమలుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఉపాధి హామీ పథకం, ఇంటింటికీ సురక్షిత తాగునీరు, జల్‌జీవన్‌ మిషన్‌ అమలు, గ్రామీణ సడక్‌ యోజన, లాక్‌పతి దీదీ, గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన, పీఎం సూర్యఘర్‌, కు సుమ్‌, పీఎం ఆవాస్‌ యోజన, పీఎం విశ్వకర్మ యోజన, పీఎం స్వనిధి వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుతో పాటు, ద్వా రకాతిరుమల, కొల్లేరు పర్యాటక రంగం, మత్స్య సంపద అభివృద్ధి తదితర అంశాలపై సమీక్షించారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌, సీపీఓ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

ట్రాన్స్‌జెండర్లకు రైస్‌ కార్డులు

1ఏలూరు(మెట్రో): జిల్లాలో ట్రాన్స్‌జెండర్లకు రైస్‌ కార్డుల జారీకి ఈనెల 4న జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. ఈ కేంద్రంలో ట్రాన్స్‌జెండర్లకు రైస్‌ కార్డులు, ఆధార్‌ కార్డుల జారీ, ఆధార్‌ కార్డులో మార్పులు, రైస్‌ కార్డులో కుటుంబ సభ్యులు మార్పులు, చేర్పులు, ఆధార్‌ కార్డులో చిరునామా, తదితర మార్పు లు చేస్తారని చెప్పారు.

యోగా రిజిస్ట్రేషన్‌ వేగిరపర్చాలి

జిల్లాలో యోగా అభ్యాసన కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం వరకు 6,16,530 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని జేసీ ధాత్రిరెడ్డి తెలిపారు. జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో 8.30 లక్షల మందిని భాగస్వాములను చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ను వేగిరపర్చాలని ఆదేశించారు.

ఏలూరులో 6 కరోనా కేసులు 
1
1/2

ఏలూరులో 6 కరోనా కేసులు

ఏలూరులో 6 కరోనా కేసులు 
2
2/2

ఏలూరులో 6 కరోనా కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement