
డీఎస్సీలో గిరిజనులకు అన్యాయం
విద్యార్థుల భవిష్యత్తో చెలగాటం
రాష్ట్రవ్యాప్తంగా శాఖలుగా విస్తరించిన ఓ ప్రైవేట్ విద్యాసంస్థ ఏలూరు పరిసర ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతోంది. 10లో u
బుట్టాయగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్లో గిరిజన నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని దుద్దుకూరులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు జీఓ 3కి చట్టభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచినా ఈ హామీని అమలు చేయకుండా తాత్సారం చేయడం చూస్తుంటే గిరిజనులపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు. జీఓ 3పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వైఎస్సార్సీపీ ఆలోచన చేసి ప్రత్యామ్నాయంగా గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు టీఏసీలో సభ్యులంతా తీర్మానం చేసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా గవర్నర్కు తీర్మాన పత్రాన్ని అందజేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆ తీర్మానం గవర్నర్ వద్దే ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఈ తీర్మానానికి అనుగుణంగా గిరిజన యువతకు న్యాయం చేయాలని కోరారు. గిరిజన యువతకు న్యాయం జరిగేందుకు చేపట్టే కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు.
ఏపీపీగా రాజ్కుమార్
నూజివీడు: నూజివీడులోని 15వ అదనపు జిల్లా జడ్జి కోర్టుకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా పట్టణానికి చెందిన వాకా రాజ్కుమార్ నియమితులయ్యారు. పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. రాజ్కుమార్ గతంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలువురు న్యాయవాదు లు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

డీఎస్సీలో గిరిజనులకు అన్యాయం