వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం

Apr 30 2025 2:02 AM | Updated on Apr 30 2025 2:02 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులను మంగళవారం నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు వెలువరించింది. పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లకు అనుసంధానంగా పరిశీలకులు పనిచేసేలా నియమించారు. ఏలూరు పార్లమెంట్‌ పరిశీలకుడిగా ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్‌, నరసాపురం పార్లమెంట్‌ పరిశీలకుడిగా కాకినాడ జిల్లా పత్తిపాడుకు చెందిన పార్టీ నేత ముదునూరి మురళీకృష్ణంరాజును నియమించారు. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావును మచిలీపట్నం పార్లమెంట్‌ పరిశీలకులుగా నియమించారు.

జీవిత బీమా సమస్యలు పరిష్కరించాలి

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న జీవిత బీమా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ పీఆర్‌టీయూ జిల్లా నాయకులు ఏపీజీఎల్‌ఐ డిప్యూటీ డైరెక్టర్‌ కే.శ్రీనివాస ప్రసాద్‌కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ మెచ్యూర్‌ అయిన ఏపీజీఎల్‌ఐ బాండ్‌లను నిధి పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే క్రమంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించాలని కోరారు.

చెరువు గండిని అడ్డుకున్న రైతులు

నిడమర్రు: కొల్లేరు అభయారణ్యం పరిధిలో అన్‌సర్వే భూముల్లో సాగు చేస్తున్న ప్రతి చేపల చెరువును అటవీ శాఖ అధికారులు ధ్వస్వం చేస్తున్నారు. దీని భాగంగా ఆకివీడు–నిడమర్రు మండలాల సరిహద్దుల్లో ఉన్న సుమారు 100 ఎకరాల చేపల చెరువుకు మట్టం వరకూ గండి కొట్టేందుకు మంగళవారం అటవీ శాఖ అధికారులు ప్రయత్నించగా స్థానిక వరి రైతులు అడ్డుకున్నారు. ఆ చెరువు పాయలో సుమారు 50 ఎకరాల వరకూ కొతలకు సిద్ధంగా ఉన్న వరి పంట మునిపోతుందని ఆందోళనకు దిగారు. వరి పంట మొత్తం భాగం అడవికొలను భాగంలో ఉండటంతో అడవికొలను నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చి వాగ్వాదానికి దిగారు. వరి కోతలు అనంతరం గండ్లు పెట్టాలని ధర్నా చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు విషయాన్ని ఉన్నతాధికారులు నివేదించారు.

వేసవి సెలవులు సద్వినియోగం చేసుకోవాలి

దెందులూరు: న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్‌ మంగళవారం దెందులూరులోని బాల సదనాన్ని దర్శించారు. బాలలకు అందుకున్న సౌకర్యాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల వేసవి సెలవుల్లో కాలాన్ని వృథా చేయకుండా జనరల్‌ నాలెడ్జి పుస్తకాలు చదవడం, చదరంగం ఆడటం మొదలైన కార్యకలాపాలు చేయాలన్నారు. సమయాన్ని వృథా చేసుకోకుండా సెల్‌ఫోన్లకు దూరంగా ఉండి విద్యలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం  1
1/5

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం  2
2/5

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం  3
3/5

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం  4
4/5

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం  5
5/5

వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుల నియామకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement