
టైర్ పంక్చర్.. అరటి గెలల వ్యాన్ బోల్తా
ద్వారకాతిరుమల: టైర్ పంక్చరై అరటి గెలల లోడుతో వెళుతున్న వ్యాన్ బోల్తా పడిన ఘటన ద్వారకాతిరుమల మండలంలోని గుణ్ణంపల్లి జాతీయ రహదారిపై, పోలవరం కుడి కాలువ వంతెన వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం. కాకినాడ జిల్లా ఏలేశ్వరంనకు చెందిన పులుమంచుల ఆనందం (ఆనందరావు) అరటి గెలల వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని తోటల్లో అరటి గెలలను కొనుగోలు చేశాడు. వాటిని నరికేందుకు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం, లింగంపర్తికి చెందిన బొలేరో డ్రైవర్ కాకర లోవరాజు, భద్రవరంనకు చెందిన పులుమంచుల ఈశ్వరరావు, లింగంపర్తికి చెందిన కోనా సత్యన్నారాయణ, అనుబోలు రామకృష్ణ (55), గుంప సూర్యనారాయణ(శివ) వ్యాపారి ఆనందంతో కలసి బొలేరో వ్యాన్లో వెళ్లారు. గెలలు నరికి, వ్యాన్లో లోడు చేసుకుని, ఏలేశ్వరం మండలం ఎర్రవరంలోని మార్కెట్కు వెళుతున్నారు. ద్వారకాతిరుమల మండలంలోని గుణ్ణంపల్లి జాతీయ రహదారిపై, పోలవరం కుడి కాలువ వంతెన వద్దకు వచ్చేసరికి వ్యాన్ వెనుక టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా వ్యాన్లో ఉన్న ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను భీమడోలు, నల్లజర్ల 108 ఆంబులెన్స్లలో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనుబోలు రామకృష్ణ మృతి చెందాడు. మిగిలిన ఐదుగురు చికిత్స పొందుతున్నారు.
ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు
అందరూ కాకినాడ జిల్లా వాసులే
ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి వద్ద ఘటన

టైర్ పంక్చర్.. అరటి గెలల వ్యాన్ బోల్తా

టైర్ పంక్చర్.. అరటి గెలల వ్యాన్ బోల్తా