జంగారెడ్డిగూడెం: సినీ హీరో నితిన్ గుర్వాయిగూడెం మద్ది క్షేత్రాన్ని దర్శించుకున్నారు. హీరో నితిన్తో పాటు, మైత్రీ మూవీస్ అధినేత రవిశంకర్, దర్శకుడు వెంకి కుడుముల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. తొలుత వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ముఖమండపం వద్ద అర్చకులు వేద ఆశీర్వాదం అందజేసి స్వామి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వీ చందన, పర్యవేక్షకుడు జువ్వాది కృష్ణ తదితరులు పాల్గొన్నారు.