
ప్రభుత్వ ఉద్యోగుల సంఘ కార్యవర్గం ఎన్నిక
భీమవరం (ప్రకాశంచౌక్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా యూనిట్ సమావేశం ఆదివారం నిర్వహించారు. జిల్లా యూనిట్ కార్యవర్గ కమిటీకి ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా వై.మోహనరావు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎస్కె ఉమర్ ఆలీ షా, ఉపాధ్యక్షులుగా జీవీ రామనాగు, ఎస్.మానస, ఎంవీ లక్ష్మీనారాయణ, ఎం.సదాశివ ప్రసాద్, కే.కనకరాజు, ఎం.వెంకటేష్, ఎం.సాయిబాబా, వి.రాజేష్ కుమార్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జి.జక్కరయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్వీఎస్ వాసు పులగండం, సహాయ కార్యదర్శులుగా ఎండీ అస్గర్ అలీ, కే మాణిక్యాలరావు, సీహెచ్ రాజేష్, జి.నారాయణ, జి.ప్రసాద్, ఎం.పద్మిని, కోశాధికారిగా పి.నాగభూషణం ఎన్నికయ్యారు.