వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

Dec 13 2025 7:46 AM | Updated on Dec 13 2025 7:46 AM

వ్యక్తి ఆత్మహత్య

వ్యక్తి ఆత్మహత్య

రౌతులపూడి: ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. గంగవరం గ్రామానికి చెందిన అల్లం రమేష్‌ (32) రాజవరం శివారున రౌతులపూడి నుంచి కోటనందూరు వెళ్లే రహదారి పక్కన ఉన్న మామిడితోటలో చెట్టుకు శుక్రవారం ఉరివేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తండ్రి అల్లం నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రౌతులపూడి ఎస్‌ఐ వెంకేటేశ్వరరావు తన సిబ్బందితో కలసి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రమేష్‌కు భార్య రమణమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

15 మందికి జైలు

కాకినాడ లీగల్‌: మద్యం తాగి వాహనాలు నడిపిన కేసుల్లో ఒకరికి పది రోజులు, ఒకరికి నాలుగు రోజులు, 8 మందికి మూడు రోజులు, ఐదుగురికి రెండు రోజుల చొప్పున శిక్ష విధిస్తూ కాకినాడ స్పెషల్‌ మొబైల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎన్‌.ఉషాలక్ష్మీకుమారి తీర్పు చెప్పారు. కాకినాడ ట్రాఫిక్‌–1, 2 పోలీసు స్టేషన్‌ పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. శుక్రవారం కోర్టులో 15 మందిని హాజరుపర్చగా వారికి జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

కుదిరిన ఎంఓయూ

భువనేశ్వర్‌: ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని సెంచూరియన్‌ యూనివర్సిటీ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ మధ్య అకడమిక్‌, పరిశోధన భాగస్వామ్యానికి ఎంఓయూ కుదిరింది. ఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ డైరెక్టర్‌ ఎస్సీ ద్వివేది, సెంచూరియన్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ అనిత పాత్ర ఈ మేరకు సంతకాలు చేశారు. ల్యాబ్‌ సదుపాయాలు, శాసీ్త్రయ నైపుణ్యాలను పరస్పరం పంచుకోవడం, సంయుక్త శిక్షణ–పరిశోధన కార్యక్రమాలు ఈ ఎంఓయూ లక్ష్యాలు. విద్యా పరిశోధన–ప్రాయోగిక ఫోరెన్సిక్‌ సేవల మధ్య అంతరం తగ్గించి, నైపుణ్యాభివృద్ధికి బలమైన వేదిక సృష్టిస్తామని ద్వివేది అన్నారు. విద్యార్థులు ఫోరెన్సిక్‌ రంగంలో పోటీ సామర్థ్యం, ఉపాధి అవకాశాలు పొందుతారని అనిత తెలిపారు. సెంచూరియన్‌ను ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’గా ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement