బాబు వచ్చినా జాబు వచ్చిందా? | - | Sakshi
Sakshi News home page

బాబు వచ్చినా జాబు వచ్చిందా?

Jun 28 2025 8:17 AM | Updated on Jun 28 2025 8:19 AM

జాబు రావాలంటే బాబు రావాలని 2014 ఎన్నికల్లో ఊదరగొట్టారు. బాబు వచ్చినా జాబు మాత్రం రాలేదు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఏ ఒక్కరికీ ఒక్క జాబూ ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ అని మరోసారి నిరూపించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందించారు. బాబు మోసాలపై ప్రతి ఇంటికీ వెళ్లి వివరిద్దాం. 2029లో మళ్లీ జగన్‌ను సీఎంను చేద్దాం.

– మార్గాని భరత్‌రామ్‌, మాజీ ఎంపీ,

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

జగన్‌ను విమర్శించే స్థాయి ఉందా?

సరిగ్గా కాలు కూడా కదపలేని కూటమి నాయకుడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను ఏదో చేస్తానని అంటున్నాడు. వయస్సుకు తగ్గ మాటలు మాట్లాడాలి. ముందు నుంచీ చంద్రబాబు మోసమే. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రెండుసార్లు ప్రజలను మోసం చేశారు. వైఎస్సార్‌ సీపీలో ఏ కార్యకర్తకు కష్టమొచ్చినా జక్కంపూడి కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. వైఎస్‌ జగన్‌ దేవుడిచ్చిన బిడ్డ. ఆ తర్వాతే రాజా, గణేష్‌.

– జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్‌ సీపీ అమలాపురం

పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు

మాట మీద నిలబడే వ్యక్తి జగన్‌

ప్రజలకు మాటిస్తే నిలబడే వ్యక్తి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వనివి సైతం అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. తిరిగి జగన్‌ సీఎంగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు అబద్ధాలతో ప్రజలు మోసపోయారు. చంద్రబాబు మోసాలను కార్యకర్తలు సమష్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.

– తిప్పల గురుమూర్తిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు

రానున్నది కార్యకర్తల ప్రభుత్వం

2029లో రానున్నది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తల ప్రభుత్వం. కార్యకర్తల సంక్షేమానికి వైఎస్సార్‌ సీపీ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. కార్యకర్తలకు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, శిక్షణ తరగతులు, సభ్యత్వ నమోదు చేయాలన్న ఆలోచనలో పార్టీ ఉంది. రీకాల్‌ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ద్వారా ప్రజల్లో కార్యకర్తలు మమేకం కావాలి.

– డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, వైఎస్సార్‌ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి

చంద్రబాబు అంతా మోసం

అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారు. విద్యార్థులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాలనూ కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో డీబీటీ ద్వారా రూ.4,65,000 కోట్లు ప్రజలకు అందించారు.

– తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే,

వైఎస్సార్‌ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌

బాబు మాట నిలబెట్టుకోవాలి

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది. హనీమూన్‌ పీరియడ్‌ అయిపోయింది. ఏడాదైనా సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయడం లేదు. మరుపు మానవ సహజం. మర్చిపోతున్న చంద్రబాబుకు హామీలు అమలు చేయమని గుర్తు చేయాలి. అందుకు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రతి ఇంటికీ చంద్రబాబు మోసాలను తీసుకెళ్లాలి.

– డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి,

మాజీ ఎమ్మెల్యే, అనపర్తి

వెన్నుపోటు దినం ఫలితమే

తల్లికి వందనం

కూటమి ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేస్తూ వైఎస్సార్‌ సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం ఆందోళన ఫలితంగానే తల్లికి వందనం పథకం అమలు చేశారు. ప్రతి పథకంలోనూ కూటమి ప్రభుత్వం కోతలు విధించింది. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని ఏడు స్థానాలూ గెలిచి తీరుతాం.

– జి.శ్రీనివాసనాయుడు, మాజీ ఎమ్మెల్యే, నిడదవోలు

బాబు వచ్చినా జాబు వచ్చిందా? 
1
1/6

బాబు వచ్చినా జాబు వచ్చిందా?

బాబు వచ్చినా జాబు వచ్చిందా? 
2
2/6

బాబు వచ్చినా జాబు వచ్చిందా?

బాబు వచ్చినా జాబు వచ్చిందా? 
3
3/6

బాబు వచ్చినా జాబు వచ్చిందా?

బాబు వచ్చినా జాబు వచ్చిందా? 
4
4/6

బాబు వచ్చినా జాబు వచ్చిందా?

బాబు వచ్చినా జాబు వచ్చిందా? 
5
5/6

బాబు వచ్చినా జాబు వచ్చిందా?

బాబు వచ్చినా జాబు వచ్చిందా? 
6
6/6

బాబు వచ్చినా జాబు వచ్చిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement