
నన్నయలో పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసేందుకు అసక్తి, అర్హత ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీపీజీ సెట్లో అర్హత పొందిన వారికి మాత్రమే ఈ అవకాశమని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి బ్రోచర్ని ఆమె విడుదల చేశారు. యూనివర్సిటీ క్యాంపస్తో పాటు తాడేపల్లిగూడెం, కాకినాడ క్యాంపస్లలో అర్ట్స్ అండ్ కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలలో పీజీ కోర్సులు అందిస్తున్నామంటూ కోర్సుల వివరాలను తెలియజేశారు. ఇతర వివరాలకు 70930 08477 నంబర్కు ఫోన్ చేయడం, లేదా యూనివర్సిటీ వెబ్సైట్ని సందర్శించాలన్నారు.