
బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన సీఐ
సామర్లకోట: పట్టణ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బుధవారం సంతమార్కెట్ సెంటర్లో ఒక బాలుడు సెల్ఫోన్ చూస్తూ నడుచుకొంటూ వెళ్లిపోతున్నాడు. దానిని గమనించిన సీఐ ఎ.కృష్ణభగవాన్ బాలుడి నుంచి వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ బాలుడు మూగవానిగా తెలుసుకున్నారు. దాంతో సెల్ఫోన్లో నంబర్కు ఫోన్ చేయడంతో ఆ బాలుడిని వేదాంశ్ కార్తికేయగా గుర్తించారు. సీఐ సమాచారం మేరకు తల్లి పోతుల తులసీ, తండ్రి శరత్కుమార్ ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. తాము విశాఖపట్నం నుంచి వేసవి సెలవుల కారణంగా కోట్లమ్మ చెరువు వద్ద బంధువుల ఇంటికి వచ్చామని తెలిపారు. రెండో తరగతి చదువుతున్న ఆరేళ్ల తమ కుమారుడు వేదాంశ్ కార్తికేయ సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకొంటూ బయటకు వచ్చేయడాన్ని తాము గమనించలేదని చెప్పారు. క్షేమంగా తమ కుమారుడిని అప్పగించినందుకు బాలుడి తల్లిదండ్రులు సీఐకి, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.