నిలిచిపోయిన సంచార పశు వైద్యం | - | Sakshi
Sakshi News home page

నిలిచిపోయిన సంచార పశు వైద్యం

May 31 2025 12:28 AM | Updated on May 31 2025 12:28 AM

నిలిచ

నిలిచిపోయిన సంచార పశు వైద్యం

పశువులకు వాటి పోషకుల ఇంటి ముంగిటనే మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. రూ.278 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 340 పశువుల అంబులెన్స్‌లు తీసుకురాగా.. జిల్లాకు 16 కేటాయించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ బృహత్తర కార్యక్రమానికి అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఫోన్‌ చేసి, పశువు అనారోగ్య సమస్యను వివరిస్తే చాలు.. అంబులెన్స్‌లో రైతు ముంగిటకే వెళ్లి వైద్య సేవలు అందించేవారు. ఈ సేవలను కూడా కూటమి ప్రభుత్వం నిలిపివేయడంతో పశు పోషకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు పశువులను తీసుకొచ్చి వైద్యం చేయించుకునేందుకు నానా పాట్లూ పడుతున్నారు.

ఫ గత వైఎస్సార్‌ సీపీ

ప్రభుత్వంలో ఇంటి వద్దనే సంక్షేమం

ఫ చేరువలోనే రేషన్‌, వైద్యం

ఫ కూటమి హయాంలో

నిలిచిన ఇంటింటి సేవలు

ఫ వలంటీర్‌, రేషన్‌ డోర్‌ డెలివరీ వ్యవస్థలు రద్దు

ఫ ఫ్యామిలీ డాక్టర్‌కు మంగళం

ఫ ప్రజలకు తప్పని ఇక్కట్లు

సాక్షి, రాజమహేంద్రవరం: గడప గడపకూ రేషన్‌ వాహనాలు రానంటున్నాయి.. ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య సేవలు స్తంభించాయి.. సంచార పశు వైద్య వాహనాలు కదలడం లేదు.. వలంటీర్‌ వ్యవస్థ రద్దుతో ప్రభుత్వ సేవలు అందుకోవడంలో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. సంక్షేమ ఫలాలు గుమ్మం వద్దకు చేరడం లేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో మారిన పరిస్థితులు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాల అమలును విస్మరించిన కూటమి ప్రభుత్వం.. ప్రజల మన్ననలు పొందిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ వస్తోంది. గతంలో ఇంటి ముంగిట్లోనే అందిన సేవలను ఇప్పుడు దూరం చేసిన ప్రభుత్వంపై వివిధ వర్గాల ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఫలితంగా అధికారం చేపట్టిన ఏడాదిలోనే కూటమి పాలన తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది.

అందని సురక్ష

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం జగనన్న సురక్ష పేరిట ఆయా సచివాలయాల పరిధిలోని ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సచివాలయాలు, క్లస్టర్‌ పరిధిలోని వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, మండల అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవసరమైన ఫ్యామిలీ మెంబర్‌, కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాలు అక్కడే అందజేసేవారు. ఈ సేవలకు కూడా కూటమి ప్రభుత్వం మంగళం పాడింది.

జిల్లాలో కూటమి హయాంలో నిలిచిన సేవలు

గ్రామ, వార్డు వలంటీర్లు 9,579

సంచార పశువైద్య వాహనాలు 16

రేషన్‌ వాహనాలు 364

సాక్షి, రాజమహేంద్రవరం: గడప గడపకూ రేషన్‌ వాహనాలు రానంటున్నాయి.. ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య సేవలు స్తంభించాయి.. సంచార పశు వైద్య వాహనాలు కదలడం లేదు.. వలంటీర్‌ వ్యవస్థ రద్దుతో ప్రభుత్వ సేవలు అందుకోవడంలో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. సంక్షేమ ఫలాలు గుమ్మం వద్దకు చేరడం లేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో మారిన పరిస్థితులు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాల అమలును విస్మరించిన కూటమి ప్రభుత్వం.. ప్రజల మన్ననలు పొందిన వ్యవస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ వస్తోంది. గతంలో ఇంటి ముంగిట్లోనే అందిన సేవలను ఇప్పుడు దూరం చేసిన ప్రభుత్వంపై వివిధ వర్గాల ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఫలితంగా అధికారం చేపట్టిన ఏడాదిలోనే కూటమి పాలన తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది.

నిలిచిపోయిన  సంచార పశు వైద్యం 1
1/3

నిలిచిపోయిన సంచార పశు వైద్యం

నిలిచిపోయిన  సంచార పశు వైద్యం 2
2/3

నిలిచిపోయిన సంచార పశు వైద్యం

నిలిచిపోయిన  సంచార పశు వైద్యం 3
3/3

నిలిచిపోయిన సంచార పశు వైద్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement