వలంటీర్లకు ఉద్వాసన | - | Sakshi
Sakshi News home page

వలంటీర్లకు ఉద్వాసన

May 31 2025 12:24 AM | Updated on May 31 2025 3:59 PM

వలంటీర్లకు ఉద్వాసన

వలంటీర్లకు ఉద్వాసన

సంక్షేమ పథకాలతో పాటు వివిధ ప్రభుత్వ సేవలను ప్రజలకు వారి ఇంటి ముంగిట్లోనే అందించే లక్ష్యంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించింది. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా 9,579 మంది గ్రామ, వార్డు వలంటీర్లు నియమితులయ్యారు. ప్రజలకు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు (కుల, ఆదాయ, రేషన్‌ కార్డులు, పింఛన్ల దరఖాస్తులు, ఫ్యామిలీ సర్టిఫికెట్లు, నేటివిటీ తదితర) కావాలన్నా, సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేయాలన్నా వలంటీర్లు దగ్గరుండి చూసుకునే వారు. 

వలంటీర్ల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి పెద్దలు గద్దెనెక్కిన తర్వాత.. అత్యంత ప్రజాదరణ పొంది, దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సర్టిఫికెట్ల కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement