
సాగర తీరాన క్రీడా సంబరం
కాకినాడ రూరల్: కాకినాడ సాగర తీరం క్రీడా సంబరానికి వేదిక అయ్యింది. ఏపీ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ వుమెన్స్ కబడ్డీ పోటీలు రూరల్ మండలం సూర్యారావుపేట న్యూ ఎన్జీఆర్ బీచ్లో శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఫ్లడ్ లైట్ల వెలుతురులో సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు కబడ్డీ పోటీలు కనువిందు చేయనున్నాయి. ఇందుకు కోసం నాలుగు కోర్టులను ఏర్పాటు చేశారు. లీగ్ కమ్ నాకౌట్ దశలో జరగనున్న కబడ్డీ పోటీలలో ప్రతిభ చూపిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కానున్నారు. పోటీలు మూడురోజులు జరుగుతాయి. రోజుకు 15నుంచి సుమారు 20మ్యాచ్లు వరకు జరగనున్నాయి. ఒక్కో జట్టులో నలుగురేసి క్రీడాకారులు తలపడనున్నారు. పూర్వపు ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన క్రీడా జట్లు పోటీలలో ప్రాతినిధ్యం వహిస్తుండడంతో 13జిల్లాల నుంచి 13పురుషుల జట్లు, 13మహిళల జట్లు హాజరవుతున్నాయి. పురుషుల జట్లుకు సూర్యారావుపేట జెడ్పీ హైస్కూల్, మహిళలకు వాకలపూడి హైస్కూల్లో వసతి, భోజన సదుపాయం కల్పించారు.
నేటి నుంచి మూడు రోజులపాటు
బీచ్ కబడ్డీ పోటీలు
రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి
క్రీడాకారుల రాక
సీనియర్ మహిళలు, పురుషుల
విభాగాల్లో పోటీలు