
చెట్టు కూలి వ్యక్తి మృతి
కొవ్వూరు: పట్టణంలో వేములూరు–దీప్తీ స్కూలు రోడ్డు మార్గంలో ఈదురుగాలుల ప్రభావానికి చెట్టు కూలి మోటారు సైకిలిస్టుపై పడడంతో వేములూరు గ్రామానికి చెందిన చిన్న రవి కుమార్ (49) మృతిచెందారు. బుధవారం రాత్రి స్నేహితుడు అత్తిలి చంద్రరావుతో కలిసి మోటారుసైకిల్పై రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో బలమైన ఈదురుగాలులు వీచి రవికుమార్ నడుపుతున్న మోటారు సైకిల్పై చెట్టు పడింది. బలమైన గాయాలు కావడంతో రవికుమార్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వెనుక కూర్చోన్న చంద్రరావుకి తీవ్ర గాయాలు కావడంతో రాజమహేంద్రవరంలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ హెడ్ కానిస్టేబుల్ ఆర్ సత్యనారాయణ తెలిపారు. మృతుడు అవంతీ ఫీడ్స్ ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేస్తున్నారు. రవికుమార్కి భార్య, కుమారుడు ఉన్నారు.
బెల్ట్షాపు నిర్వాహకులపై కేసులు
కాకినాడ క్రైం: కాకినాడ జిల్లా ఎకై ్సజ్ పరిధిలో గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులు కాకినాడ అర్బన్, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని, పెద్దాపురంలో బెల్ట్షాపులు నిర్వహిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు.