ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Mar 24 2026 7:03 AM | Updated on Mar 24 2026 7:03 AM

ఫ బాలుడి మృతి

ఫ ఎనిమిది మందికి గాయాలు

కాకినాడ రూరల్‌: పుట్టిన రోజు వేడుకలో వారంతా సరదాగా గడిపారు.. తిరిగి తమ ఇళ్లకు బయలు దేరారు.. ఈ నేపథ్యంలో అనుకోని ప్రమాదం ఓ బాలుడిని బలి తీసుకుంది. అలాగే మరో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. కాకినాడ – సామర్లకోట రోడ్డులో ప్రతాప్‌నగర్‌ వంతెన వద్ద సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఇందులో బాలుడు పలివెల అక్షంత్‌ (10) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట నుంచి ఆటోలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు 9 మంది ఆటోలో కాకినాడకు వచ్చారు. కాకినాడలో రెండు గదులు అద్దెకు తీసుకుని, అక్కడ వేడుకల అనంతరం వారు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ప్రతాప్‌నగర్‌ వంతెన వద్దకు వచ్చేసరికి వారి ఆటోను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సామర్లకోట బళ్ల మార్కెట్‌ ప్రాంతానికి చెందిన అక్షంత్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా, ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీరబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement