ఏడు కచిడీలు @ రూ.2 లక్షలు
సఖినేటిపల్లి: పల్లిపాలెం కేంద్రంగా సముద్రంపై శుక్రవారం వేటకు వెళ్లిన మత్స్యకారుల పంట పండింది. శనివారం వలకు చిక్కిన చేపలతో పాటు 7 కచిడీ చేపలు, మరి కొన్ని టేకు చేపలు లభ్య మయ్యాయి. వాటిని ఫిష్ మార్కెట్కు తీసుకురాగా వాటిలో కచిడీ రకం చేపలకు మంచి ధర పలికింది. రూ.2 లక్షలకు పైబడి వెచ్చించి ఆ చేపలను ఓ వ్యక్తి దక్కించుకున్నాడు. అలాగే సుమారు 200 కేజీల బరువున్న టేకు చేపను కొనుగోలుదారుడు రూ.20 వేలకు వేలంలో పాడుకున్నాడు. ఔషధాల తయారీలో ఈ చేపను వినియోగిస్తారని మత్స్యకారులు చెబుతున్నారు.
ఏడు కచిడీలు @ రూ.2 లక్షలు


