ఐఎండీ కార్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఐఎండీ కార్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన

Sep 10 2025 3:49 AM | Updated on Sep 10 2025 3:49 AM

ఐఎండీ కార్యాలయం ఏర్పాటుకు  స్థల పరిశీలన

ఐఎండీ కార్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన

అమలాపురం రూరల్‌: జిల్లా ప్రజలు ప్రకృతి వైపరీత్యాల నుంచి జాగ్రత్త పడేందుకు వీలుగా భారత వాతావరణశాఖ (ఐఎండీ) కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు యోచన చేస్తున్నట్లు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం భారత వాతావరణశాఖ అధికారులు భట్నవెల్లిలోని ఒనువులమ్మ దేవాలయం వద్ద సేకరించిన 50 సెంట్ల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఐఓండీ కార్యాలయం ఏర్పాటుకు 50 సెంట్లు స్థలం అనువుగా ఉందని అధికారులు అభిప్రాయ పడ్డారన్నారు. ఈ కార్యాలయం ఏర్పాటు వల్ల ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందస్తు హెచ్చరికలు అందుతాయన్నారు. తద్వారా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా అప్రమత్తం కావచ్చన్నారు. వర్షం, ఎండ, చలి, తుపానులు, వడగండ్ల వాన, భూకంపాల వంటి వాటికి ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement