కూలీ పనులకు తల్లిదండ్రులు.. బాలికకు మాయమాటలు చెప్పి..

Young Man Molested Minor Girl At Mailardevpally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దంపతులు కొంత కాలంగా మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మిగూడ ప్రాంతంలో ఉన్న రాజీవ్‌గృహకల్పలో నివాసం ఉంటున్నారు. వీరికి 8వ తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. కుటుంబ పోషణ నిమిత్తం తల్లిదండ్రులు కులీపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.

సమీపంలోని 26 సంవత్సరాల ఓ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి ఎవరూ లేని సమయంలో లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. అత్యాచారానికి గురైన బాలికకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

చిన్నారిని చితకబాదిన టీచర్‌ 
చైతన్యపురి: నర్సరీ విద్యార్థిని క్లాస్‌ టీచర్‌  వాతలు వచ్చేలా చితకబాదిన సంఘటన చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రంగారెడ్డి తెలిపిన మేరకు..మున్సిపల్‌ కాలనీలో నివసించే సక్రూనాయక్, మోనికల కుమారుడు ధనుష్‌ (5) గణేష్‌పురి కాలనీలోని ప్రిన్స్‌ స్కూల్‌లో నర్సరీ చదువుచున్నాడు. సోమవారం అల్లరి చేస్తున్నాడని క్లాస్‌ టీచర్‌ భాను కట్టెతో ధనుష్‌ను వాతలు పడేలా కొట్టింది.

ఇంటికి వెళ్లిన బాలుడికి జ్వరం వచ్చింది. ఆరా తీయగా.. టీచర్‌ కొట్టిందని చెప్పాడు. దీంతో ధనుష్‌ మేనమామ కిషోర్‌ పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపల్, కరెస్పాండెంట్‌ స్వరూపారాణిని అడిగాడు. దీంతో ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్ప­టమే కాక టీచర్‌ భానును సమర్థించింది. జరిగిన సంఘటనపై కుటుంబ సభ్యులు పిర్యాదు చేయగా బుధవారం ప్రిన్సిపల్‌ స్వరూపారాణి, టీచర్‌ భానుపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.
చదవండి: Hyderabad: ఐటీ కారిడార్‌లో దారుణం 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top