రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి

Road Accident In West Bengal 13 People Assassinated - Sakshi

కోల్‌కతా : పొగమంచు కారణంగా పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లా ధూప్‌గురి నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 13 నిండు ప్రాణాలు బలవ్వటంతో పాటు మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఓ ట్రక్కు రోడ్డును కప్పేసిన పొగమంచుతో దారి కనిపించక ఆటోను, కారును ఢీకొట్టింది. దీంతో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top