Guntur Crime: Molestation Attack on Women - Sakshi
Sakshi News home page

మహిళపై లైంగికదాడి.. రూ.50 వేలు దోపిడీ

Sep 5 2021 4:33 AM | Updated on Sep 5 2021 10:49 AM

Molestation Attack On Women In Guntur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ప్రత్తిపాడు : ఓ ఆటో డ్రైవర్‌ మహిళపై రెండు సార్లు లైంగికదాడికి పాల్పడి ఆపై ఆమె వద్ద ఉన్న నగదును దోచుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో జరిగింది. ఎస్‌ఐ అశోక్‌ తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు రూరల్‌ మండలం పొత్తూరుకు చెందిన ముక్కల విజయలక్ష్మి శనివారం పొత్తూరు నుంచి చిలకలూరిపేటకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది.

అప్పటికే ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు దిగిపోవడంతో ఆటో డ్రైవర్‌ గొర్రెముచ్చు శివరామయ్య.. ఆటోలో ఒంటరిగా ఉన్న మహిళతో మాటమాటా కలిపాడు. ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి ఆటోను తీసుకువెళ్లి మహిళపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వద్ద ఉన్న రూ.50 వేలు దోచుకెళ్లాడు. బాధిత మహిళ 100కు డయల్‌ చేయడంతో ప్రత్తిపాడు పోలీసులు అప్రమత్తమై డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement