మందలించాడని అన్నను హత్య చేసిన తమ్ముడు | Man Assassinated His Elder Brother In Gopalapuram | Sakshi
Sakshi News home page

మందలించాడని అన్నను హత్య చేసిన తమ్ముడు

Jan 25 2021 6:11 PM | Updated on Jan 25 2021 6:15 PM

Man Assassinated His Elder Brother In Gopalapuram - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : గోపాలపురం మండలం కరగ పాడులో దారుణం చోటుచేసుకుంది. అన్నదమ్ముల మధ్య చిన్నపాటి వివాదం హత్యకు దారి తీసింది. కరక పాడు గ్రామానికి చెందిన మద్దాల సుధీర్, సతీష్ అన్నదమ్ములు. ఈ క్రమంలో తమ్ముడు సతీష్ చెడు వ్యసనాలకు బానిసై పని చేసిన సొమ్మును ఇంటి దగ్గర ఇవ్వడం లేదని ఇటీవల అన్న సుధీర్ మందలించాడు. దీంతో అన్నపై కోపం పెంచుకున్న తమ్ముడు సతీష్ ఆదివారం రాత్రి తన స్నేహితుడైన దుర్గాప్రసాద్ సహాయంతో అన్న గొంతుకు ఉరివేసి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు గోపాలపురం ఎస్సై సుబ్రహ్మణ్యం తెలియజేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement