ఆలయ భూమిని సంరక్షించండి | - | Sakshi
Sakshi News home page

ఆలయ భూమిని సంరక్షించండి

Dec 16 2025 4:26 AM | Updated on Dec 16 2025 4:26 AM

ఆలయ భూమిని సంరక్షించండి

ఆలయ భూమిని సంరక్షించండి

– ఆందోళన చేపట్టిన ఇరువారం ప్రజలు

చిత్తూరు కలెక్టరేట్‌ : చోళ రాజుల కాలం నాటి ఆలయ భూములను కబ్జా చేస్తున్నా రని జిల్లా కేంద్రంలోని ఇరువారానికి చెందిన గుణశేఖర్‌, విశ్వనాథ్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆ గ్రామ ప్రజలు సోమవారం కలెక్టరేట్‌లో ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని 20వ వార్డు ఇరువారంలో సర్వే నం.345లో 2.5 ఎకరా భూమి కాళికాదేవి ఆలయానికి సంబంధించిందన్నారు. కొందరు వ్యక్తులు ఆ భూమి ఆక్రమణకు యత్నించారన్నారు. ఎండోమెంట్‌, రెవెన్యూ అధికారులు ఆక్ర మణదారులకు అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. చోళరాజు కాలంలో ఆలయానికి భూములు ఇచ్చారని, ఆ భూము లు అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆ భూములపై కన్నేశారన్నారన్నారు. ఆ భూములను పురోహితులు అనుభవించవచ్చే గానీ, అమ్మడం, లీజుకు ఇవ్వడం వంటివి చేయకూడదన్నారు. అయితే ప్రస్తుతం కొంత భూమిని లీజుకు ఇచ్చారన్నారు. సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఆలయ భూమిలో బోరు వేస్తున్నారన్నారు. ఆ భూమిని కమర్షియల్‌గా వినియోగించడం కుదరన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆలయ భూమి కబ్జా కాకుండా కాపాడాలని కలెక్టర్‌ను కోరినట్టు వెల్లడించారు. ఇరువారం ప్రజలు జ్యోతి, కమల, దుర్గాప్రసాద్‌, ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement