శ్రీసిటీలో టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం
శ్రీసిటీ (సత్యవేడు) : శ్రీసిటీలోని పేక్స్ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(పీఈటీఐ) సంస్థ తమ అవరణలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎన్ఏబీఎల్( నీటి/ మురుగునీటి నాణ్యత టెస్టింగ్ ల్యాబ్ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డాక్టర్ సన్నారెడ్డి మాట్లాడుతూ.. శ్రీసిటీని ‘ క్లీన్ అండ్ గ్రీన్’ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే సంకల్పానికి ఇది మరో మైలురాయిగా అభివర్ణించారు. పేక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుదీప్ సంగమేశ్వరన్ మాట్లాడుతూ.. ఈ కొత్త ల్యాబ్ ‘మేక్ ఇన్ ఇండియా’ఆలోచనకు అనుగుణంగా టెస్టింగ్ సేవలను అందిస్తుందన్నారు.


