నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలి | - | Sakshi
Sakshi News home page

నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలి

Dec 11 2025 8:15 AM | Updated on Dec 11 2025 8:15 AM

నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలి

నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలి

చిత్తూరు కలెక్టరేట్‌ : అర్హులైన నిరుపేదలందరికీ కచ్చితంగా సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్‌ లంకా దినకర్‌ అన్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన బుధవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ ఆధ్వర్యంలో సమీక్ష చేపట్టారు. చైర్మన్‌ మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకంలో రూ.150 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement