ఆఖరి మజలీలో మళ్లీ కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

ఆఖరి మజలీలో మళ్లీ కష్టాలు!

Jun 27 2025 4:31 AM | Updated on Jun 27 2025 4:31 AM

ఆఖరి

ఆఖరి మజలీలో మళ్లీ కష్టాలు!

పుత్తూరు: పట్టణంలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికలో ప్రజలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. గత ఏడాది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.151 కోట్ల వ్యయంతో నాటి పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పుత్తూరు పట్టణానికి అత్యాధునిక గ్యాస్‌ ఆధారిత శవ దహనవాటిక (ఎలక్ట్రికల్‌ క్రమటోరి యం షెడ్డు)ను ఏర్పాటు చేయించారు. శ్మశాన వాటిక మధ్యలో రోజా చారిటబుల్‌ ట్రస్ట్‌చే ముక్తి ప్రదాత శివుని భారీ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారు. దీనికి దక్షిణ కైలాస ముక్తిథామం అని నామకరణం చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది తిరక్క ముందే రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన క్రమటోరియం మిషన్లు పాడై పోయాయని షెడ్‌కు తాళాలు వేశారు. దీంతో మృత దేహాలను మళ్లీ పిడకలపై కాల్చే పాత పద్ధతికి శ్రీకా రం చుట్టినట్‌లైంది. పాడైన విషయం తెలియని ప్రజలు మృతదేహాలతో శ్మశాన వాటికలోకి వచ్చేస్తున్నారు. తీరా ఇక్కడి వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని అప్పుడు పిడకల కోసం వెతుకులాట ప్రారంభిస్తున్నారు. గొయ్యి తీసి పూడ్చేందుకు మనుషులు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తంతు గత నెల రోజులుగా జరుగుతున్నా మున్సిపల్‌ అధికారులు ఎలక్ట్రికల్‌ క్రమటోరి యం మిషన్లు మరమ్మతు చేయించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మరమ్మతులు త్వరతగతిన పూర్తి చేసి ఎలక్ట్రికల్‌ క్రియేషన్‌ షెడ్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

త్వరలో మరమ్మతులు పూర్తి చేస్తాం

ఎలక్ట్రికల్‌ క్రమటోరియం షెడ్‌లో ఓ మోటారు తో పాటు రెండు సెన్సార్లు పనిచేయడం లేదు. వీటిని చైన్నెకి చెందిన కంపెనీ వారు ఏర్పాటు చేశారు. అదే కంపెనీ వారిని మరమ్మతులకు పిలిచాం. రెండు రోజుల్లో వస్తామని చెప్పి ఉన్నా రు. వారు వచ్చిన వెంటనే మరమ్మతులు పూర్తి చేసి, షెడ్‌ను వినియోగంలోకి తీసుకొస్తాం.

– ఎం.మంజునాథ్‌గౌడ్‌, కమిషనర్‌, పుత్తూరు మున్సిపాలిటీ

ఆఖరి మజలీలో మళ్లీ కష్టాలు! 1
1/1

ఆఖరి మజలీలో మళ్లీ కష్టాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement