హత్య కేసులో నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితుడి అరెస్టు

Jun 27 2025 4:31 AM | Updated on Jun 27 2025 4:31 AM

హత్య కేసులో నిందితుడి అరెస్టు

హత్య కేసులో నిందితుడి అరెస్టు

విజయపురం : స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ నెల 23వ తేదీ భూ తగాద కారణంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వెంకటేశ్వరన్‌ (55) హత్య చేసిన కేసులో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నగరి డీఎస్పీ సయ్యద్‌ అబ్దుల్‌ అజీజ్‌ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. తమిళనాడు తిరుత్తణి తాలూకా అరుంబాకం గ్రామానికి చెందిన వెంకటేశ్వరన్‌, అదే కాలనీకి చెందిన వెంకటేశన్‌కు గత 12 సంవత్సరాలుగా భూ తగాదా ఉంది. ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీ వెంకటేషన్‌, తన ఇద్దరి కుమారులు ప్రభు, సేత పాతర్కాడు సమీపంలో కొబ్బరి తోట వద్ద వెంకటేశ్వరన్‌ను కత్తితో దాడి చేసి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం వెంకటేషన్‌ను అరెస్టు చేశారు. అతని ఇద్దరి కుమారులు పరారీలో ఉన్నారు. ఈ కేసు ఛేదించడంలో సహకరించిన సీఐ భాస్కర్‌, ఎస్‌ఐ రంగా, గోవిందరాజులు, సుబ్రమణ్యం, నరేష్‌, సత్యరాజ్‌, మణివల్లన్‌, అయ్యప్ప, శశికుమార్‌, దామోదరం, హరి, ప్రసాద్‌, లక్ష్మయ్యను డీఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement