
మత్తు వదలాలి.. భవిష్యత్ మారాలి
చిత్తూరు అర్బన్: యువత మత్తు వదిలి.. భవిష్యత్ బంగారు బాట పట్టేలా అడుగులు వేయాలని కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, జిల్లా లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి భారతి పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలో గురువారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం–అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా గాంధీ విగ్రహం నుంచి దర్గా సర్కిల్, చర్చివీధి మీదుగా ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ యువత మత్తుకు బానిసలైతే జీవితం చిత్తవుతుందన్నారు. గంజాయి జోలికి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో అవగాహన తీసుకోవాలన్నారు. మత్తు వదిలేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో మేయర్ అముద, చుడా చైర్మన్ కఠారి హేమలత, డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ
చిత్తూరులో మాదక ద్రవ్యాల నివారణపై ర్యాలీ

మత్తు వదలాలి.. భవిష్యత్ మారాలి