
విద్యుత్శాఖకు నష్టం రూ.11 లక్షలు
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో శుక్రవారం సాయంత్రం వీచిన గాలీవానతో విద్యుత్శాఖకు రూ.11 లక్షలు నష్టం వచ్చిందని ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. శనివారం నష్టం వివరాలను తెలియజేశారు. చిత్తూరు నగరం, గుడిపాల, యాదమరి, జీడీనెల్లూరు, పులిచెర్ల, సదుం ప్రాంతాల నందు మొత్తం 78 కరెంటు స్తంభాలు, 16 ట్రాన్స్ఫార్మర్లు, 2.5 కిలోమీటర్లు కేబుల్, కిలోమీటర్ కండక్టర్ నేలవాలిందన్నారు. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడిందన్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పునరుద్ధరణ చర్యలు చేపట్టారన్నారు. నగరంలో కొంగారెడ్డిపల్లెలో జరుగుతున్న పనులను ఈఈ మునిచంద్ర పరిశీలించారు.

విద్యుత్శాఖకు నష్టం రూ.11 లక్షలు